రైతులకు పుండ్ల పై కారం………రాయలసీమ లో….
రాజకీయం వ్యవసాయం.. ఈ రెండూ ఒకదానికొకటి ఆధారపడే వ్యవహారాలు… వ్యవసాయాన్న నిర్లక్ష్యం చేయడం వలనే టిడిపి ఓడిపోయింది. వ్యవసాయానికి వైయస్ ఇచ్చిన ప్రాముఖ్యత వల్లే నాటి ఎన్నికల్లో వైఎస్ పార్టీ గెలిచింది.
రెండోసారి కూడా ముఖ్యమంత్రి పదవిని గెలిచి పోవడానికి కారణం, అన్ని రంగాలతో పాటు వ్యవసాయం కి కూడా ఇచ్చిన ప్రాధాన్యత వలే… తను ఒక మారిన మనిషిగా చెప్పుకున్నారు బాబు….. గత ఎన్నికల్లో ప్రజలకు చాలా వరాలు ప్రకటించారు… ఒకప్పుడు తను తీవ్రంగా వ్యతిరేకించిన రైతులకు ఉచిత విద్యుత్ సహా ఎన్నో హామీలు చేశారు…వాటి ప్రభావం బాగానే కనిపించింది… ప్రత్యేకించి రైతు రుణమాఫి పథకంతో.. ఈ హామీ రాయలసీమలో టిడిపికి చాలా ఓట్లు తెచ్చిపెట్టింది.
సీట్లను కూడా కట్టబెట్టింది. రుణమాఫీ హామీ రైతులను బాగానే ఆకర్షించింది.వ్యవసాయ రుణాలను మాఫీ చేయడంతో పాటు వ్యవసాయం కోసం రైతులు వారి బంగారని తాకట్టు పెట్టి తెచ్చుకున్న రుణాలను రద్దు చేసినట్లు అధికారం ఇస్తే చాలు అని బాబు ప్రకటించారు.ఈ ప్రచారాన్ని ఒకరేంజ్ లో నిర్వహించారు ఆ పార్టీ నేతలు.
ప్రత్యేకంగా అనంతపురం జిల్లాలో రుణమాఫీ మీద చాలా ఆశలతోనే కనిపించిది. అందుకు నిదర్శనమే ఈ జిల్లాలో టిడిపి స్వీప్ చేయడం. తీరా సీటు ఎక్కక రుణమాఫీ సంగతి బాబు అసలు పట్టించుకోలేదు.
చంద్రబాబు నాయుడు కు అధికారం దక్కగానే చాలా షరతులు గుర్తు వచ్చావు మరి…అనేక షరతులతో రుణమాఫీ కి చాలామందిని అనర్హులుగా సృష్టించారు… బంగారం రుణమాఫీ లపై అసలు మాఫీ ఏ లేకుండా పోయింది.కేవలం లాంగ్ టర్మ్ లోన్లు మాత్రమే మాఫీ కిందకి ప్రకటించారు… దీనికి చాలా షరతులు కూడా పెట్టారు.
రుణ మాఫీ చేశారా… అంటే అదీ లేదు…
ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత చెప్పిన మాటలకు, వ్యవహరించిన తీరుకు అసలు సంబంధమే లేదు. పోనీ కనీసం అర్హులుగా ఉన్నవారికైనా రుణ మాఫీ చేశారా… అంటే అదీ లేదు… విడతలవారీగా మాఫి అని అన్నారు.
రైతుల రుణమాఫీ విషయంలో నోరు తెరిస్తే చాలు అన్ని అబద్ధాలే అన్నట్లుగా సాగిన ఆయన వైనం.. అయితే విడతల పద్ధతి ద్వారా వేసే మొత్తాలకు, రైతుల రుణాలపై వచ్చే వడ్డీలకు సరిపోతూ వస్తోంది… ఇప్పటివరకు వేసింది మూడు విడతలే…చంద్రబాబు పాలన కాలంలో ఐదో సంవత్సరం అయిపోతుంది కానీ ఇప్పటివరకు మూడు విడతలుగా జమ చేశారు.
కొన్ని వేల కోట్ల రూపాయలు చెల్లించాలి ,అందుకే కొత్త ఎత్తుగడ కింద అవుట్ డేటెడ్ చెక్కులను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది… ఇప్పుడు చెక్కులు మాత్రమే ఇస్తారట… మళ్లీ అధికారం అప్పగిస్తే… అనే ఫరతును పెట్టడానికి సిద్ధమవుతున్నారు…. ఇలా బ్లాక్మెయిల్ కూడా మొదలుపెట్టారు.. ఇది రుణమాఫీ కథ.. గత ఎన్నికల్లో టిడిపి పార్టీ ఎన్నో ఓట్లను కొన్ని సీట్లను అతిమంగా అధికారాన్ని అప్పగించిన కీలకమైన హామీల విషయంలో ఈ విధంగా చంద్రబాబు వ్యవహరించారు.
మాఫీ అయిపోయిందని అనుకుంటున్న బాబు…
నాలుగు, ఐదో విడతల ఒకసారి మాఫీ సొమ్మును ఇప్పుడు జమ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు…ఇప్పుడు మరో మోసానికి కాలు దువ్వుతున్నారు. 4 ,5 విడుదల కూ సంబంధించి బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు.
రుణమాఫీ అమలు సాధ్యం కాదు అని జగన్ అప్పుడే అంటే చేసి చూపిస్తానని టిడిపి పార్టీ సవాల్ విసిరారు… రైతులు పుండ్లమీద కారం చల్లుతూ ఉన్నారని జగన్ పేర్కొన్నారు. అసలే మంటలో ఉన్న రైతులకు ఇప్పుడు అవుట్ డేటెడ్ చెక్కులు ఇవ్వడం ద్వారా ఇప్పుడే కథ మొదలైంది…