ఈవీఎంలతోనే ఎన్నికలు.. వేరే మాటే లేదు

రానున్న ఎన్నికలను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ మీదనే నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులు స్పష్టంచేశారు.

ఏపీలో ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించడానికి వచ్చిన సీఈసీ సునీల్ ఆరోరా ఇదే విషయాన్ని స్పష్టంచేశారు.

ఈవీఎంల విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అభ్యంతరాలు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈవీఎంలతో ఎన్నికలు వద్దని.. బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించాలని బాబుగారు ఇటీవలే సీఈసీని కలిశారు. ఈవీఎంలు ట్యాంపర్ అవుతాయని బాబుగారు అన్నారు.

ఇండియాలో టెక్నాలజీకి తనే పితామహుడిని అని చెప్పుకునే చంద్రబాబు.. ఈవీఎంలను మాత్రం శంకిస్తున్నారు.

అంతజేసీ.. ఆయన గత ఎన్నికల్లో నెగ్గింది ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికలతోనే. బాబుగారు ఎందుకు ఈవీఎంలకు ఇప్పుడు భయపడుతున్నారో అర్థంకాని పరిస్థితి.

ఇలాంటి నేఫథ్యంలో బ్యాలెట్ పేపర్ల ఊసేలేదు అని.. ఈవీఎంలతోనే ఎన్నికలు అని సీఈసీ స్పష్టంచేశారు. ఇక పక్షపాతంతో వ్యవహరిస్తున్నారనే అధికారుల విషయంలో తాము చర్యలు తీసుకునే అవకాశం ఉందని సీఈసీ పేర్కొన్నారు.

కోడ్ అమల్లోకి వచ్చాకా.. ఇలాంటి వారిపై చర్యలు తప్పవని అన్నారు.

పక్షపాతంతో వ్యవహరించవద్దని ఎన్నికల విధుల్లోని అధికారులకు ఆయన సూచించారు.

డీజీపీతో సహా ఎవరి విషయంలో ఫిర్యాదులు వచ్చినా పరిశీలిస్తామని అన్నారు.

ఇక ఏపీలో ఓట్ల తొలగింపు అంశం మీద దృష్టి సారిస్తున్నట్టుగా పేర్కొన్నారు.

ఈ అవకతవకలపై ఫిర్యాదులు వచ్చాయన్నారు. నామినేషన్ల చివరిరోజు వరకూ ఓటు నమోదుకు అవకాశం ఉంటుందని సీఈసీ సునీల్ ఆరోరా పేర్కొన్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *