అమల్లోకి రానున్న ఏడు జిల్లాలో ఎన్నికల కోడ్

సీఎంతో సహా మంత్రులు, అధికారిక కార్యక్రమాలు నిర్వహించరాదు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, అతిథిగృహంలు వాడరాదని స్పష్టీకరణ.

రాష్ట్రంలో గ్యాడ్జెట్స్ ,ఒక ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో ఈ ఎన్నికలు జరిగే ఏడు జిల్లాల్లో తక్షణం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చినట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, శ్రీకాకుళం, విజయనగరం ,విశాఖ జిల్లాల్లో సీఎంతో సహా రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు అధికారిక కార్యక్రమాలు నిర్వహించారాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.

గ్రాడ్యుయేట్స్, ఉపాధ్యాయులకు ప్రభావితం చేసే ఎటువంటి విధానపరమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించినట్లు అని పేర్కొంది.

ఈ జిల్లాల్లో మంత్రులు సీఎంతో సహా అధికారిక వాహనాలను , ఎస్కార్ట్లు లను వినియోగించరాదు.

ప్రభుత్వ అతిథి గృహాల తో పాటు ప్రభుత్వానికి చెందిన ఎయిడెడ్ ఇనిస్ట్యూట్లను వినియోగించరాదని సంఘం పేర్కొంది.

ఈ ఏడు జిల్లాల్లో ఎటువంటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన లుచేయరాదని స్పష్టం చేసింది.

ప్రభుత్వ శాఖలు కూడా ఎటువంటి కొత్త పథకాలను, కార్యక్రమాలను ప్రకటించరాదని సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *