మేనిఫెస్టో ప్రకటనపై ఈసీ తాజా తాజా నిబంధన…

గత లోక్సభ ఎన్నికలలో మొదటి దశ పోలింగ్ రోజున బిజెపి తన మేనిఫెస్టో విడుదల చేయడంతో కాంగ్రెస్ కి ఫిర్యాదు చేసింది. అయితే ఈ సినిమా మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోక పోయినా తాజాగా దీనిపై నిబంధన రూపొందించింది

48 గంటల ముందే మేనిఫెస్టో ప్రకటన పూర్తి చేయాలి.

పోలింగ్ కి ముందు రోజు ఇంటర్వ్యూలు కూడా బంద్

ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటించే మేనిఫెస్టో విషయంలో ఇంత వరకు ఎలాంటి నిబంధనలు లేవు. కాగా దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం కొత్త నియమావళి ప్రవేశపెట్టింది.

పోలింగ్కు 48 గంటల ముందే పార్టీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

విడుదలను కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళి లో చేర్చుతూ ప్రజా ప్రాతినిధ్య చట్టం 1956 లోని సెక్షన్ 126 కింద నిర్ణయం తీసుకుంది.

ఈ సెక్షన్ ప్రకారం 48 గంటల ముందు ప్రచారాన్ని నిలిపివేయవలసి ఉంటుంది.

అందువల్ల ఎన్నికల నిశ్శబ్ద కాలంలో మేనిఫెస్టో కూడా విడుదల చేయడానికి వీలు లేదని తెలిపింది.

విడుదలకు సంబంధించి ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో తాజా నిబంధనల తీసుకొచ్చింది.

గత లోక్సభ ఎన్నికల్లో మొదటి పోలింగ్ రోజున బీజేపీ తన మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇది ఓటర్లను ప్రభావితం చేసేది గా ఉందంటూ అప్పట్లో కాంగ్రెస్ ఫిర్యాదు చేసిన ఏసీ మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

దీనిపై అధ్యాయానికి ఒక కమిటీ వేసి నిజమే 72 గంటల ముందే మేనిఫెస్టో విడుదల చేయాలని సిఫార్సు చేసింది.

ఈసీ మాత్రం రెండు రోజులకే దీనిని పరిమితం చేసింది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ మార్చి 10న వెలువడగా తొలి విడత ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది.

మొత్తం ఏడు దశల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల తొలి దశ పోలింగ్ ఏప్రిల్ 11న జరుగుతుంది. తుది విడత మే 19 ఇది తల్లి తాలు మే 23న వెల్లడవుతాయి.

ప్రచారం ముగిసిన తరువాత ఎన్నికల అంశాలకు సంబంధించి రాజకీయ నాయకులు స్టార్ కాంపైనరులు మీడియాకు ఎలాంటి ఇంటర్వ్యూలు కూడా ఇవ్వరాదని స్పష్టం చేసింది.

గుజరాత్ ఎన్నికల పోలింగ్ ముందు రోజు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ప్రసారం కావడంతో బీజేపీ విమర్శలు గుప్పించింది. అయితే ప్రధాని

మోడీ సైతం అదేరోజు రోడ్డు షో నిర్వహించడంతో కాంగ్రెస్ ఎదురుదాడి చేసింది.

దీంతో తాజా ఎన్నికలకు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా నిర్వహించాలని ఈసీ నిర్ణయించుకుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *