టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారని విజయ శాంతి ఆరోపించారు

ఒక్కో ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారు.. అక్కడెవరూ కేసీఆర్‌ను నమ్మరు: విజయ శాంతి
టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారని విజయ శాంతి ఆరోపించారు.

కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ దిశగా ఎవరూ ఆలోచించడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

1.టీఆర్ఎస్ పార్టీలో చేరడానికి ఒక్కో కాంగ్రెస్ ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు ఇస్తున్నారని విజయ శాంతి ఆరోపించారు.
2.కేసీఆర్ థర్డ్ ఫ్రంట్‌ దిశగా ఎవరూ ఆలోచించడం లేదన్నారు.
3.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరుతుండటం పట్ల కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి సంచలన ఆరోపణలు చేశారు. రూ.30 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లో చేర్చుకుంటున్నారని ఆమె ఆరోపించారు. డబ్బుకు లొంగిన వాళ్లే పార్టీ మారుతున్నారని ఆమె విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్‌ పట్ల ఇష్టం లేకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా అభ్యర్థి ఎలా గెలిచారని ఆమె ప్రశ్నించారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీయాలని విజయ శాంతి కోరారు. ‘ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు. గెలిచిన తర్వాత టీఆర్ఎస్‌లో చేరుతున్నారు. పార్టీ నాయకత్వం గురించి అప్పుడు లేని సమస్య ఇప్పుడే వచ్చిందా?’ అని విజయ శాంతి ప్రశ్నించారు. పార్టీ మారడం కోసం ఎమ్మెల్యేలు నాయకత్వ లేమి అనే వంక చెబుతున్నారని ఆమె తెలిపారు.

కారు లోడ్‌ ఎక్కువైతే యాక్సిడెంట్‌ అవుతుందని విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను నమ్ముతారేమో కానీ.. ఉత్తరాదిలో మాత్రం ఆయన్నెవరూ నమ్మరని ఆమె చెప్పారు. కేసీఆర్‌తో కలిసి ఫెడరల్‌ ఫ్రంట్‌ దిశగా ఎవరూ ఆలోచించడం లేదని ఆమె తెలిపారు.

పేదలకు ఏడాదికి రూ.72 వేల ఆర్థిక సాయం అందించే పథకాన్ని రాహుల్‌గాంధీ తీసుకొస్తున్నారు. పేదరికం ఉండకూడదనే ఆలోచనతోనే రాహుల్ ఈ పథకాన్ని తీసుకొస్తున్నారని విజయ శాంతి తెలిపారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *