ప్రజల హృదయాలకు హత్తుకునేలా డాక్టర్ వైయస్ రాజశేఖర్రెడ్డి యాత్ర మూవీ

  • ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో విడుదల అయ్యింది.
  • యాత్ర మూవీ కి రేటింగ్ 3.5 / 5 అని చెప్పవచ్చు.
  • ముఖ్యంగా ఈ యాత్ర సినిమాలో ప్రేక్షకుల హృదయాల్లో హత్తుకునేలా పెంచల దాస్ పాడిన పాటలు హైలెట్ అయ్యాయి.
  • డాక్టర్ వైఎస్ అభిమానులకు, అనుచరులకు నిజంగా ఈ మూవీ ఓ చక్కటి జ్ఞాపకం అని చెప్పాలి.

మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన చరిత్రాత్మక పాదయాత్ర నేపథ్యంతో తెరకెక్కిన సినిమా యాత్ర..

మలయాళ మెగాస్టార్‌ మమ్మూటి వైఎస్సార్‌ పాత్రలో నటించిన ఈ సినిమా గురువారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో విడుదలయింది.

పేదల గుండె చప్పుళ్ళు , ప్రజలు సమస్యలు పాదయాత్ర ద్వారా తెలుసుకుని అవసరమైన పధకాలు ,కార్యక్రమాలు చేపట్టి ప్రజా హృదయంలో నిల్చిన మహానాయకుడు గా దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నిలిచారు.

ఆయన జీవిత చరిత్ర ఆధారంగా తీసిన యాత్ర మూవీ , డాక్టర్ వైఎస్ పాత్రలో మళయాళ సూపర్ స్టార్ ముమ్ముట్టి జీవించాడు.

స్క్రీన్ మీద చూస్తుంటే వైఎస్ మళ్ళీ వచ్చాడా అన్నట్లుగా మెప్పించాడు.

ఇక ఈ సినిమాలో డాక్టర్ వైఎస్ పాత్రతో పాటు ఆయా పాత్రలను తీర్చిదిద్దిన ఘనత మహీ వి రాఘవ్ కే దక్కుతుంది.

ఇక రాజారెడ్డి కేరక్టర్ లో జగపతి బాబు నటన సూపర్బ్. ఒకానొక దశలో ముమ్ముట్టి,జగపతి బాబు ఒకరికొకరు పోటీ పడి నటించారు.

చేవెళ్ల చెల్లెమ్మ అని ఆప్యాయంగా సబితా ఇంద్రారెడ్డిని డాక్టర్ వైఎస్ పిలుస్తూ ఆమెకు హోమ్ శాఖ కూడా ఇచ్చారు.

ఏపీలో తొలి మహిళా హోమ్ మంత్రిగా సబితా రికార్డుకెక్కారు. ఆ పాత్రలో సుహాసిని చక్కగా నటించారు. రావు రమేష్, వంటి నటులు అద్భుతంగా నటించారు.

ఇక సినిమాకు మ్యూజిక్ ఎక్కడికక్కడ చక్కగా అమరింది. ఎక్కడ ఎలా సెట్ అవ్వాలో అలా అయింది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కుదిరింది.

పెంచల్ దాస్ పాడిన ఓపాట సినిమాకు హైలెట్.

డాక్టర్ వైఎస్ మరణం తర్వాత బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈ సాంగ్ అందరిని కట్టిపడేస్తుంది. అందరికీ తెల్సిన కథను రొటీన్ కి భిన్నంగా కొత్తదనం చూపిస్తూ స్క్రీన్ ప్లే నడిపించి తీరు సూపర్బ్.

ఇంకా చెప్పాలంటే ఎక్కడా రాజకీయ రంగు అంటకుండా,ఓ మహనీయుడు జీవితం ఎలా ఉండాలో అలా తీర్చిదిద్దారు.

కాంగ్రెస్ తరపున నెగ్గిన డాక్టర్ వైఎస్ ఆపార్టీ తరపున సీఎం అయిన తీరు,పైగా కాంగ్రెస్ కి ఎక్కడా డామేజ్ జరగకుండా చిత్రీకరించిన తీరు హేట్సాఫ్ అనిపించుకుంటుంది.

ముమ్ముట్టి నుంచి ప్రతి డైలాగ్ కూడా డాక్టర్ వైఎస్ ను తలపిస్తాయి. ప్రజల సమస్యలు ఎలా అర్ధం చేసుకున్నారో, ప్రజల మనిషిగా ఎలా ఎదిగారో చాలా చక్కగా చూపించారు.

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో 2003లో డాక్టర్ వైఎస్ చేపట్టిన పాదయాత్ర ఎలా సాగించారు, ఎంతమంది ప్రజలతో మమేకం అయ్యారు , రైతు సమస్యలను ఏ కోణంలో చూసారు , రైతే రాజు అనే దానికి ఎలాంటి అర్ధం ఇచ్చారు.

అలాగే వివిధ వర్గ్లాల సమస్యలను అర్ధం చేసుకున్నాక వాటిని ఏవిధంగా తీర్చారు ఇలా అన్ని కోణాల్లో ఈ సినిమాను చక్కగా డైరెక్టర్ మహీ తీర్చిదిద్దారు. ఇక క్లైమాక్స్ లో హెలికాఫ్టర్ ప్రమాదంలో డాక్టర్ వైఎస్ మరణించిన తీరుని ఆవిష్కరించిన తీరు కళ్ళు చెమరుస్తాయి.

వాతావరణం బాగోలేకపోయినా, ప్రమాదం అని తెల్సినా కూడా తనకోసం వెయిట్ చేసే ప్రజలను కలుసుకోవాలని బయలుదేరడం, హెలికాఫ్టర్ కూలిపోవడం వంటి ఘటనలను నేచురల్ గా తీశారు.

డాక్టర్ వైఎస్ మరణంతో ఎంతమంది. అభిమానులు,కార్యకర్తలు ప్రాణాలు ఎలా వదిలారో ఇవన్నీ నేచురల్ గా చూపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *