పిచ్చి వేషాలు వెయ్యొద్దు పాకిస్తాన్ కి క్లాస్ పీకిన చైనా
ఆపద సమయంలో చైనా తమకు అండగా నిలుస్తుందని పాకిస్తాన్ బావించింది కానీ భారత్, పాకిస్థాన్ దేశాల వివాదాల్లో తాము తలదూర్చి బోమని డ్రాగన్ కంట్రీ మరోమారు నిరూపించింది.
పైగా పాకిస్థాన్ కు క్లాస్ పీకింది పిల్ల చేష్టలు చెయ్యొద్దు అంటూ సుతిమెత్తగా హెచ్చరించింది.
అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించె చర్యలను చైనా సహించబోదని స్పష్టం చేసింది, చైనా స్పందనతో పాకిస్తాన్ కంగుతింది.
నిజానికి పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో ఉన్న బాల్ కొట్ భారత వైమానిక దళం మెరుపు దాడులు నిర్వహించి ఉగ్ర తండాలను నేలమట్టం చేసింది.
ఈ దాడులను చైనా తో సహా ఒక దేశము ఖండించలేదు, పైగా పాకిస్తాన్ కు ఒక దేశం కూడా అండగా నిలబడలేదు.
ఈ విషయాన్ని పాక్ మాజీ రాయబారి ఒక్కరు స్వయంగా వెల్లడించారు. ఇప్పుడు మరోసారి పాక్ కు అలాంటి అనుభవమే ఎదురైంది.
భారత్ ఎయిర్ స్టేక్స తరువాత భారత గగనతలంలోకి పాక్ యుద్ధవిమానాలు చొచ్చుకొచ్చి భారత మిలటరీ స్థావరాలపై దాడికి యత్నానించి విఫలమయ్యాయి.
భారత వైమానిక దళం సమర్థవంతంగా తిప్పికొట్టడం తో పాక్ యుద్ధ విమానాలు తోకముడిచి వెనక్కి వెళ్ళి పోయాయి.
అదే సమయంలో పాక్ చెందిన ఎఫ్ 16 రకం యుద్ధ విమానాన్ని కూడా భారత్ కూల్చివేయగా భారత్ పైలట్ను పాక్ సేనలు బందీగా పట్టుకున్నాయి.
ఈ పరిణామాలను వివరించేందుకు తమ మిత్రదేశంగా భావిస్తున్న చైనాకు , పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ బుధవారం అర్ధరాత్రి చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యికి అత్యవసరంగా ఫోన్ చేశారు. అయితే చైనా స్పందన చూసి ఆయన షాక్ తిన్నారు.
పాక్ దూసుకెళ్లడ ని తప్పుబట్ టుగా వాoగ్ యి కీ మాట్లాడారు. ముఖ్యంగా అన్ని దేశాలు సార్వభౌమాధికారం, సమగ్రతను గౌరవించాల్సిన అవసరం ఉందని చైనా భావిస్తుందని ఖురేష్ కి స్పష్టం చేశారు.
ఇదే అంశాన్ని చైనా విదేశాంగ శాఖ ఓ ప్రకటన రూపంలో విడుదల చేసింది అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించే చర్యలను చైనా సoహoచబొదని కూడా ఈ సందర్భంగా ఖురేష్ కి స్పష్టం చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది.