ప్రకాశం జిల్లా టీడీపీకి ఆమంచి రాజీనామా? ఎందుకు? బుజ్జగించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలం
ప్రకాశం జిల్లా టీడీపీలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లోని నేతల మధ్య అసమ్మతి బెడద ఎక్కువగా ఉన్నప్పటికీ తాజాగా చీరాల శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్ టీడీపీని వీడారు.
టీడీపీలో రాజకీయ ప్రకంపనలు, ఎమ్మెల్యే ఆమంచి రాజీనామా.టీడీపీని వీడిన చీరాల ఎమ్మెల్యే వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం.
ఆమంచిని బుజ్జగించేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నం విఫలం.
ప్రకాశం జిల్లాలలో తెలుగుదేశం పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ టీడీపీకి రాజీనామా చేశారు.
ఎమ్మెల్యే ఆమంచి టీడీపీని వీడుతారంటూ గత కొద్ది రోజుల నుంచి ప్రచారం జరుగుతోంది. దీంతో, అధినేత చంద్రబాబు అయనను బుజ్జగించే ప్రయత్నం చేశారు.
మంత్రి శిద్ధా రాఘరావును ఆమంచి వద్దకు దూతగా పంపారు. అనంతరం, సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే కృష్ణమోహన్ కలిసినా, ఆయన నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు.
బుధవారం టీడీపీకి రాజీనామా చేసిన ఆమంచి, తన లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు పంపారు.
అంతకు ముందు తన ముఖ్య అనుచరులు, కార్యకర్తలతో సమావేశమైన ఆమంచి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. కాసేపట్లో లోటస్పాండ్లో
వైసీపీ అధినేత జగన్ను కలిసి పార్టీలో చేరనున్నారు.
నియోజకవర్గంలో వర్గపోరు తారాస్థాయికి చేరడంతో ఆమంచి టీడీపీని వీడుతున్నట్టు ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఆమంచి, ఎమ్మెల్సీ పోతుల సునీత వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
చీరాలలో రెండు గ్రూపులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే పోతుల సునీతకు పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలిగా నియమించిందనే అసంతృప్తి ఆమంచి వర్గీయుల్లో నెలకొంది.
గత ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించిన ఆమంచి కృష్ణమోహన్ తర్వాత టీడీపీలో చేరారు.