దేశాన్ని రక్షించాలి నినాదంతో ఆమ్ఆద్మీ పార్టీ దిల్లీకి మళ్లీ చంద్రబాబు
నియంతృత్వం నశించాలి.. దేశాన్ని రక్షించాలి’ నినాదంతో ఆమ్ఆద్మీ పార్టీ దిల్లీలో బుధవారం నిర్వహించనున్న భారీ ప్రదర్శనకు ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరుకానున్నారు.
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని నిరసిస్తూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ దీక్షను, భారీ ప్రదర్శనను నిర్వహించనున్నారు.
కార్యక్రమానికి దేశంలోని భాజపాయేతేర పార్టీల నాయకులను ఆయన ఆహ్వానించారు.
విపక్ష నాయకులతో కలిసి చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొననున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు.. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో సమావేశమవుతారు.