చంద్రబాబుపై దగ్గుబాటి సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబును చూస్తే జాలేస్తోంది.. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, కామెంట్లను నేనైతే భరించలేను. ముఖ్యమంత్రి సీట్లో గంట కూడా కూర్చోలేను. గతంలో పోలవరాన్ని వ్యతిరేకించి.. ఇప్పుడు క్రెడిట్ కోసం ఆరాటపడుతున్నారు.

చంద్రబాబు వింత జాతికి చెందిన వ్యక్తని తీవ్ర వ్యాఖ్యలుఉదయం ఓ మాట.. సాయంత్రం మరో మాటంటూ ఫైర్చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని విమర్శ

చంద్రబాబు పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయ్యాయంటున్నారు మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు. తన తోడల్లుడు వింత జాతికి చెందిన వ్యక్తని.. ఉదయం ఒకమాట.. సాయంత్రం మరోమాట మాట్లాడే స్వభావమంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

చంద్రబాబును చూస్తే జాలేస్తోందని.. సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, కామెంట్లను తానైతే భరించలేనన్నారు.

ముఖ్యమంత్రి సీట్లో తానైతే గంట కూడా కూర్చోలేనన్నారు. మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడిన దగ్గుబాటి చంద్రబాబు టార్గెట్‌గా విరుచుకుపడ్డారు.

చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే పనిని ఇంటెలిజెన్స్ ఐజీకి అప్పగించారని ఆరోపించారు దగ్గుబాటి. పార్టీలో ఉన్న అసంతృప్త నేతలకు కాంట్రాక్టులు కట్టబెడతామంటూ ఇంటెలిజెన్స్ ఐజీ ప్రలోభాలకు గురి చేస్తున్నారని చెప్పుకొచ్చారు.

ఆ పోలీసు అధికారి ఆస్తులు కొనుగోలు, అమ్మకాలపై జోక్యం చేసుకుంటున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణాన్ని గ్రాఫిక్సుల్లో చూపిస్తున్నారు.. అక్కడి వాస్తవాలు వేరని వ్యాఖ్యానించారు.

డిజైన్లు ఫైనల్ చేయడానికే నాలుగేళ్ల సమయం పట్టిందా అంటూ ప్రశ్నించారు. పోలవరాన్ని వ్యతిరేకించారు.. దీక్షలతో డబ్బు వృధా…గతంలో పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకించిన చంద్రబాబు..

ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ క్రెడిట్ కోసం ఆరాపటుడుతున్నారని విమర్శించారు వెంకటేశ్వరరావు.

పోలవరం గురించి పోరాడుతున్న యర్రా నారాయణస్వామిని చంద్రబాబు మందలించారని.. అప్పుడు వద్దన్న చంద్రబాబు.. ఇప్పుడు మొత్తం తానే కడుతున్నానని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.

రూ.కోట్లు ఖర్చు పెట్టి దీక్షల పేరుతో ప్రజధనాన్ని దుర్వినియోగం చేశారని.. దీక్షలతో సాధించింది ఏమీ లేదన్నారు.

ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై నిర్లక్ష్యం

పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయంలో చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరించారని దగ్గుబాటి ఆరోపించారు. పార్లమెంటులో విగ్రహం పెట్టే అవకాశం ఉన్నా.. చంద్రబాబు పట్టించుకోలేదన్నారు.

అప్పటి స్పీకర్ మీరాకుమార్‌కు పురందేశ్వరి విజ్ఞప్తి చేయడంతో ఎన్టీఆర్ విగ్రహం పార్లమెంట్‌లో పెట్టగలిగారన్నారు.

రాజకీయాలు వద్దనుకున్నానని.. ప్రశాంతంగా రిటైర్ అవ్వాలనుకున్నానని వెంకటేశ్వరరావు చెప్పారు. అందుకే హితేషును రాజకీయాల్లోకి తీసుకొచ్చామన్నారు.

బుధవారం తాడేపల్లిలో జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరుతున్నట్టు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు.

పర్చూరు నియోజకవర్గం నుంచి తన కుమారుడు హితేష్ పోటీ చేస్తారని చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నానని హితేష్ అన్నారు.

తన కుటుంబానికి చెడ్డ పేరు రాకుండా క్రమశిక్షణతో పని చేస్తానన్నారు. జగన్‌తో కలిసి నడవడం చాలా సంతోషంగా ఉందని.. జగన్ ప్రజల కోసం పడుతున్న కష్టం చూసి వైసీపీలో చేరబోతున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *