ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష ముగించిన చంద్రబాబు.. అమిత్ షా లేఖకు కౌంటర్..

బీజేపీ, కేంద్రం దాడి చేస్తే.. మేము ఎదురు దాడి చేస్తాం. తప్పు చేస్తున్నామని పశ్చాత్తాపం కూడా మోదీ, అమిత్ షాలకు లేదు. విభజన హామీలను సాధించే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదు. హామీలను నెరవేర్చని ప్రధానికి ఎలా స్వాగతం పలుకుతాం.

నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింజేసిన మాజీ ప్రధాని దేవెగౌడ,

అమిత్ షా లేఖకు గట్టిగా కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు

అన్యాయం జరుగుతున్నా మిమ్మల్ని సమర్థించాలా అంటూ ఫైర్ అయ్యారు. చంద్రబాబు చేపట్టిన ధర్మపోరాట దీక్ష ముగిసింది. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన దీక్షను రాత్రి 8 గంటలకు విరమించారు.

మాజీ ప్రధాని దేవెగౌడ నిమ్మరసం ఇచ్చి చంద్రబాబుతో పాటూ జేఏసీ నేతలతో దీక్షను విరమింపజేశారు. ధర్మపోరాట దీక్షతో ఏపీ ప్రజలు ఏకాకులు కాదని.. దేశం మొత్తం బాసటగా ఉందని నమ్మకం వచ్చిందన్నారు చంద్రబాబు.

ఏపీ ప్రజలకు భరోసా కల్పించిన ప్రతి ఒక్కరికీ ఐదుకోట్ల ఆంధ్రులు రుణపడి ఉంటారన్నారు. ఇంతమంది అభిమానం, ఆదరణ.. తమకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో బలం చేకూర్చిందని కృతజ్ఞతలు తెలిపారు.

హమీలు నేరవేర్చని ప్రధానికి స్వాగతం ఎలా పలుకుతాం

ఏపీ ప్రజలకు అమిత్ షా రాసిన లేఖకు కౌంటర్ ఇచ్చారు చంద్రబాబు. నాలుగున్నరేళ్లగా మోసం చేసి.. ఇప్పుడు కూడా అసత్యాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ప్రత్యేక హోదాను.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌ సాక్షిగా హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

ఇక ముంపు మండలాలను కలిపితేనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పానన్నారు.

నెల్లూరు, తిరుపతిలో ఇచ్చిన హామీల్ని నెరవేర్చకుండా.. రాజధాని నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా.. పోలవరానికి రావాల్సిన నిధుల్ని కూడా విడుదల చేయలేదని విమర్శించారు.

రాజధాని నిర్మాణానికి సహకరిస్తామని.. మట్టి తెచ్చి మొహాన కొట్టారని మండిపడ్డారు.
ప్రత్యేక హోదా బదులు స్పెషల్ ప్యాకేజీ ఇస్తామని చెబితే ఒప్పుకున్నానని గుర్తు చేశారు ఏపీ సీఎం.

ప్యాకేజీకి చట్టబద్దత కల్పించాలని పదే, పదే కోరినా సమాధానం లేదన్నారు. మిత్ర ధర్మాన్ని ఉల్లంఘించింది బీజేపీనే అని.. తప్పులు చేసినా మిమ్మల్ని సమర్థించాలా అంటూ నిలదీశారు.

అందుకే బీజేపీతో విభేదించి.. న్యాయం కోసం పోరాడుతున్నామన్నారు.

ఏపీకి అన్యా యం చేశారు కాబట్టి దీక్ష, నిరసనలు తెలియజేస్తున్నామని.. హామీలను నెరవేర్చని ప్రధానికి ఎలా స్వాగతం పలుకుతామని ప్రశ్నించారు.

బీజేపీ, కేంద్రం దాడి చేస్తే.. తాము ఎదురు దాడి చేస్తామన్నారు చంద్రబాబు. తప్పు చేస్తున్నామని పశ్చాత్తాపం కూడా మోదీ, అమిత్ షాలకు లేదన్నారు. విభజన హామీలను సాధించే వరకు వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.

ప్రజలకు అబద్ధాలు చెప్పడానికి వచ్చిన అమిత్ షాకు శ్రీకాకుళంలో ఖాళీ కుర్చీలు స్వాగతం పలికాయని.. సభకు ప్రజలు కూడా రాలేదని ఎద్దేవా చేశారు.

రాష్ట్రానికి అన్యాయం జరిగితే ప్రతి ఒక్కరూ బొబ్బిలి పులిలా తిరగబడతారు అంటూ హెచ్చరించారు.

రాష్ట్రపతిని కలుస్తాం

ధర్మపోరాదీక్షకు ఊహించని మద్దతు లభించిందన్నారు చంద్రబాబు. ఏపీకి సంఘీభావంగా మోదీ అండ్ కో తప్ప అందరూ వచ్చారన్నారు.

విభజన హామీలు సహా, కొత్త రాష్ట్రానికి అన్ని విధాలా అండగా నిలబడాలని నేతలు గట్టిగా చెప్పారని.. ఇప్పుడు ఓ నమ్మకం, భరోసా కలిగిందన్నారు.

ఏపీ డిమాండ్లపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మంగళవారం కలుస్తామని.. ఏపీ భవన్ నుంచి కలిసి ర్యాలీగా వెళ్తామని చెప్పారు.

రాష్ట్రపతిని కలిసేందుకు 11మందికే అనుమతి ఇచ్చారని.. తాము వెళ్లి వినతి పత్రం అందజేస్తామన్నారు.

హోదా కోసం ఆత్యహత్య చేసుకున్న వ్యక్తికి రూ.20లక్షలు ఎక్స్‌గ్రేషియా
ప్రత్యేక . తన సంతాపం తెలిపారు. అర్జునరావు కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *