కన్వీనర్‌గా యనమల….టీడీపీ మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు

15 మంది సభ్యులతో కమిటీ.. త్వరలోనే భేటీ. సంక్షేమానికి పెద్ద పీట వేసేలా మేనిఫెస్టో రూపకల్పన చేశారు.మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టిన టీడీపీ. సీనియర్ నేత, మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశారు.

ఎన్నికల సమరంలో దూకుడు పెంచిన టీడీపీ సీనియర్లు, యువ నేతలతో కలిపి మేనిఫెస్టో కమిటీ రైతులు, మహిళలు, యువతకు పెద్ద పీట వేస్తున్నారు.

ఎన్నికలు ముందుకు వస్తున్న తరుణంలో ఏపీలో పార్టీలు దూకుడు పెంచాయి. ఎన్నికల వ్యూహాలు, అభ్యర్థుల ఎంపికతో పాటూ మేనిఫెస్టోపై ఫోకస్ పెట్టాయి.

ఈ ఎన్నికల సమరంలో ఓ అడుగు ముందుకేసిన టీడీపీ మేనిఫెస్టో కోసం కమిటీని ఏర్పాటు చేసారు.మంగళవారం అధిష్టానం ఈ కమిటీని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత,మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు.

కమిటీ కో-కన్వీనర్గా మంత్రి కాల్వ శ్రీనివాసుల్ని నియమించారు. మేనిఫెస్టో కమిటీ సభ్యులుగా మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు అవకాశం కల్పించారు.

కమిటీ సభ్యులు

గంటా శ్రీనివాసరావు-మంత్రి

అచ్చెన్నాయుడు-మంత్రి

ఎన్‌ఎండీ ఫరూక్-మంత్రి

కిడారి శ్రవణ్ కుమార్-మంత్రి

నిమ్మల రామానాయుడు-ఎమ్మెల్యే

వాసుపల్లి గణేష్ కుమార్-ఎమ్మెల్యే

భూమా బ్రహ్మనంద రెడ్డి-ఎమ్మెల్యే

డొక్కా మాణిక్య వరప్రసాద్-ఎమ్మెల్సీ

స్వాతి రాణి-జెడ్పీ ఛైర్మన్

పంచుమర్తి అనురాధ-టీడీపీ నేత

కృష్ణయ్య-టీడీపీ నేత

కుటుంబరావు-ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు

ఈ మేనిఫెస్టో కమిటీ త్వరలోనే సమావేశంకానుంది. సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ.. మహిళలు, యువత, రైతులను ఆకర్షించేలా టీడీపీ మేనిఫెస్టోకు రూపకల్పన చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *