దిక్కుతోచని పరిస్థితిలో ఏపీ రాజకీయ విశేషాలు…
60 సీట్లను పవన్ కళ్యాణ్ తో బేరం ఆడాలని కమ్యూనిస్టు పార్టీల నేతలు అనుకున్నారు. 60 సీట్లను పవన్ నుంచి తీసుకోవాలని… తాము చెరో 30 సీట్లకు పోటీ చేయాలని కమ్యూనిస్టు కలలు కంటున్నారు.
ఇలా కలలు కంటూ నెల రోజులు గడిచాయి. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ వీరి సీట్ల బేరానికి మాత్రం పిలవలేదు.
ఎర్ర పార్టీతో చేతులు కలిపి పోటీ చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ప్రకటన వరకు బాగానే ఉంది… కానీ పొత్తు సంగతి ఇంకా ఖరారు కాలేదు.
అసలు ఈ విషయంపై ఎర్ర పార్టీల అభిప్రాయాన్ని కూడా పవన్ కోరినట్టుగా కనిపించడం లేదు.
ఉభయ కమ్యూనిస్టు పార్టీల వారు మీడియాకు అయితే చెప్పుకున్నారు. తమ 60 సీట్లను ఆశిస్తున్నట్లు అది కూడా నెల కిందటే చెప్పారు
వీళ్ళ సీట్లకు ఇంకా పంచాయితీ చర్చలు కూడా మొదలు కాలేదు. ఒకవైపు కమ్యూనిస్టు పార్టీలతో కలిసి పోటీ చేస్తున్నట్లు గా ప్రకటించిన కళ్యాణ్, మరోవైపు తమ పార్టీ టికెట్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికీ ఆ ప్రక్రియ మొదలైంది కూడా.
దరఖాస్తులను ఆహ్వానించడం అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సీట్లకు అప్లికేషను తీసుకుంటారు. మరి అన్ని సీట్లకు దరఖాస్తులను తీసుకోవడం అంటే కమ్యూనిస్టుల పరిస్థితి ఏమిటి… వారికి సీట్లు ఇస్తున్నట్లు లేదా అనే విషయాలపై స్పష్టత ఇంకా రాలేదు.
ఇంకా ఎలక్షన్స్ కు ఎంతో సమయం లేదు…. కాబట్టి ఈ పాటికే సీట్ల చర్చలు జరిగి పోవాల్సింది. కమ్యూనిస్టులకు ఎన్ని సీట్లు ఇవ్వాలని తేల్చేన తరువాత పవన్ కళ్యాణ్ మిగిలిన సీట్లకు దరఖాస్తులు తీసుకోవాల్సింది. ఈ విషయంపై ఎర్ర పార్టీల వారు ఏమి స్పందించడం లేదు.
ఏం మాట్లాడితే పవన్ కళ్యాణ్ కి కోపం వస్తుందో అని ఎక్కడ పొత్తే వద్దు అని తమను పక్కనే పెడతారో అని దైన్య స్థితిలో ఉన్నారు ఉభయ కమ్యూనిస్టు పార్టీ నేతలు…
అందుకే పొద్దు అని ప్రకటన చేసి , తనుకు తోచినట్లుగా అభ్యర్థుల విషయంలో పవన్ దరఖాస్తులు తీసుకుంటున్న… తమ వాటా 60 సీట్లు అని చెప్పుకున్న కర్ర పార్టీలో వారు కామ్ గా ఉన్నారు. మరి పవన్ తో వీరి ప్రేమ కథ ఎలా సాగుతుందో చూడాలి ఇంకా…