ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్షకు జాతీయ నేతల సంఘీభావం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మపోరాట దీక్షకు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది.
వివిధ జాతీయ పార్టీలు ఆయన దీక్షకు సంఘీభావం తెలుపుతున్నాయి.
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా, ఎస్పీ నేత ములాయం, టీఎంసీ ఎంపీ ఒబ్రెయిన్, శరద్ యాదవ్ తదితరులు దీక్షకు మద్దతు పలికారు.
ఏపీ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఎండగట్టారు.
ఎవరేమన్నారంటే..
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కామెంట్స్
చంద్రబాబు కృషికి పూర్తిగా సహకరిస్తాం
‘భారత ప్రభుత్వం ఏపీకి పార్లమెంట్ సాక్షిగా హామీ ఇచ్చింది.
ప్రత్యేక హోదా హామీ కూడా పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిందే.
ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
విభజన హామీలకు అప్పుడు అన్ని పార్టీలు ఆమోదం తెలిపాయి.
ప్రత్యేక హోదా సాధించుకోవడానికి చంద్రబాబు చేస్తున్న కృషికి అందరం సహకరిస్తాం
ఫరూక్ అబ్దుల్లా కామెంట్స్
ఏపీ కి సహాయం చేయడం కేంద్రానిదే బాధ్యత
పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రానిదే.
ధర్మం తప్పినప్పుడే ప్రజల్లో ఆందోళన మొదలవుతుంది. అందుకే ఆంధ్రా ప్రజలు ఇక్కడికి వరకు వచ్చారు.
ఓట్ల కోసం ప్రజలను కులాలు, మతాలను విభజించి కేంద్రం పాలించాలని చూస్తోంది.
దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ ప్రభుత్వం పోవాలి.
వ్యక్తిగత దూషణల స్థాయికి ప్రధాని దిగజారకూడదు.
ప్రధాని అన్న వ్యక్తి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి
మూలం సింగ్ కామెంట్స్
చంద్రబాబు తో మేమున్నాం
ఏపీ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది.
చంద్రబాబు వెంట మేమంతా ఉంటాం.
చంద్రబాబు ఏ కార్యక్రమం చేపట్టినా ఎస్పీ ఆయన వెంటన నడుస్తోంది.
చంద్రబాబు వెంట రైతులు, పేదలు, అన్ని వర్గాల ప్రజలు4 ఉన్నారు.
వారు న్యాయం కోసం పోరాడతారు. అవసరమైతే తిరగబడతారు.
ఒబ్రెయిన్ కామెట్స్
హోదా గురించి మాత్రం మాట్లాడరు
పార్లమెంట్ సాక్షిగా ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. దానిపై ప్రధాని మోదీ ఒక్క మాట మాట్లాడరు.
మోదీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వం గద్దె దిగే సమయం ఆసన్నమైంది.
మోదీ, అమిత్ షా ఇద్దరూ దేశ ప్రజలను గందరగోళానికి గురిచేస్తున్నారు.
తన ప్రసంగాల్లో మోదీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు.
కానీ దేశానికి మోదీ చేసిందేమీ లేదు.
స్వతంత్ర దర్యాప్తు సంస్థలను ఆయన నిర్వీర్యం చేస్తున్నారు.
జైరామ్ రమేష్ కామెంట్స్
విభజన హామీల్లో ఏ ఒక్కటీ పూర్తిస్థాయిలో కేంద్రం నెరవేర్చలేదు
కేంద్రం సహకరించకపోయినా పోలవరాన్ని త్వరితగతిన పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నారు
రాజ్యసభ వేదికగా ఇచ్చిన ప్రత్యేక హోదా మోదీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది
ఆనాడు వెంకయ్యనాయుడు ఐదేళ్లు కాదు.. ప్రత్యేక హోదా పదేళ్లని చెప్పారు
శరద్ పవార్ కామెంట్స్
ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
పార్లమెంటు సాక్షిగా ఏపీకి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
దేశం ఇప్పుడు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది
రైతులు, నిరుద్యోగులు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు
ప్రధానమంత్రి ప్రతిపక్షాల ఐక్యతను ప్రశ్నిస్తున్నారు
ఎమర్జెన్సీ హయాంలో కూడా ఇలానే అన్ని పక్షాలు ఏకమయ్యాయి
శరద్ యాదవ్ కామెంట్స్
దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది
రాహుల్ గాందీ కామెంట్స్
దేశ ప్రధానిగా ఒక మాట చెప్పారంటే అది తూ.చ. తప్పకుండా అమలు చేయాలి
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన మాటను ఈ ప్రధాని పెడచెవిన పెట్టారు
దేశ ప్రధానిగా ఒక మాట చెప్పారంటే అది తూ.చ. తప్పకుండా అమలు చేయాలి
ఏపీ ఈ దేశంలో భాగంకాదా?
ప్రధాని ఎక్కడికెళ్తే అక్కడి పాట పాడతారు
ఏపీకి వెళ్తే హోదా ఇవ్వకుండేనే అబద్ధాలు చెబుతారు
ప్రధాని మోదీకి విశ్వసనీయత లేదు… ఆయన చెప్పేవన్నీ అబద్ధాలే
మోదీని గద్దె దింపేందుకే మా భారత ప్రభుత్వ ప్రధాని చట్టసభలో ఆంధ్రప్రదేశ్ కి హామీ ఇచ్చారు
ఒక ప్రధాని ఇచ్చిన హామీని ప్రస్తుత ప్రధాని నెరవేర్చలేదు
నరేంద్ర మోదీ ఎక్కడికి వెళ్లినా అబద్దాలే చెబుతున్నారు
చౌకీదార్ చోర్ అని అంతా అంటున్నారు
ప్రధాన మంత్రి రాఫెల్ కుంభకోణంలో దొంగ అని తేలారు
అనిల్ అంబానీకి వేల కోట్లు దోచిపెట్టారు