అమరావతి ఉద్యమం 200 రోజుల రోజులకు చేరిన సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 7 గంటలకు అన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన

అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా 200 సిటీల నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిగా ప్రజా రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ మద్దతు తెలిపారు.

అమరావతి ఉద్యమాన్ని, నినాదాన్ని సోషల్ మీడియా ద్వారా యావత్ దేశానికి వినిపించాలని అమరావతి జేఏసీ నేతలు పిలుపును ఇచ్చారు.

అమరావతి ఉద్యమం మరో మైలురాయిని చేరుకుంది.. ఈ పోరు ఏకంగా 200 రోజులకు చేరింది. ఆరు నెలలకుపైగా ఈ ఉద్యమం నిర్విరామంగా సాగుతోంది.

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే నినాదాన్ని వినిపిస్తూ రైతులు, మహిళలు, చిన్నారులు పోరాటం చేస్తున్నారు.

మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో ప్రకటించిన రోజు నుంచి నిద్రాహారాలు మాని దీక్షలు, ధర్నాలు, ర్యాలీలతో నిరసను తెలియజేస్తున్నారు.

రాజధాని గ్రామాలైన వెలగపూడి, తుళ్లూరు, రాయపూడి, తాళ్లపాలెం, బేతపూడి.. ఇలా అన్ని చోట్ల ఉద్యమం కొనసాగుతోంది.

ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతాయని తేల్చి చెబుతున్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి రాజధానిని ఇక్కడే కొనసాగిస్తామని చెప్పే వరకు వెనక్కు తగ్గేది లేదంటున్నారు.

అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా శనివారం ఉదయం 10.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో దీక్షలు చేయనున్నారు.

అమరావతి ఉద్యమంపై ఉదయం 11 గంటలకు వర్చువల్ మీటింగ్ జరుగనుంది. పలువురు జాతీయ, రాష్ట్ర నాయకులు ఈ మీటింగ్‌లో పాల్గొంటారు.

అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రాత్రి 7 గంటలకు అన్ని ప్రాంతాల్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నారు.

అమరావతి ఉద్యమం 200 రోజులకు చేరిన సందర్భంగా 200 సిటీల నుంచి ఎన్‌ఆర్‌ఐలు ఒకే రాష్ట్రం, ఒకే రాజధానిగా ప్రజా రాజధాని అమరావతినే కొనసాగించాలంటూ మద్దతు తెలిపారు.

అమరావతి ఉద్యమం 200 రోజులు పూర్తి అవుతున్న సందర్భంగా కువైట్‌లోని ప్రవాసాంద్ర తెలుగు అసోషియేషన్ తరపున క్యాండిల్స్‌తో మద్దతు తెలపనున్నారు.

అమరావతి ఉద్యమాన్ని, నినాదాన్ని సోషల్ మీడియా ద్వారా యావత్ దేశానికి వినిపించాలని అమరావతి జేఏసీ నేతలు పిలుపును ఇచ్చారు.

ఇటు మాజీ మంత్రి నారా లోకేష్ అమరావతి ఉద్యమంపై స్పందించారు.

‘జగన్ గారూ! మూడు రాజధానుల పేరుతో ఆంధ్రప్రదేశ్ ను మూడు ముక్కలు చేసి మీ అవినీతి భాగస్వామికొకటి,

మీ తప్పుడు పత్రిక నిర్వాహకునికి ఒకటి, మీ మామకొకటి ఇచ్చేసుకోడానికా… 29,881 మంది రైతులు రాజధాని అమరావతి కోసం త్యాగం చేసింది?.

మీ మూడు ముక్కలాటకు ఇప్పటికే 64 మంది రాజధాని రైతులు, రైతు కూలీలు బలయ్యారు. వారి త్యాగాలను పణంగా పెట్టే మీ ఆటలు సాగనివ్వం.

200 రోజులుగా రైతులు ఆందోళన చేస్తుంటే తేలిగ్గా తీసుకుంటారా. రాష్ట్రప్రజలరా! ఇది రాజధాని రైతు సమస్య మాత్రమే కాదు.

విధ్వంసకర పాలనకు, ప్రజా ద్రోహానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటం.

అందుకే కుల మత ప్రాంతాలకు అతీతంగా ఏకంకండి. “ఒకే రాష్ట్రం- ఒకే రాజధాని” అంటూ అమరావతి కోసం ఉద్యమిద్దాం.జై అమరావతి!’ అంటూ ట్వీట్ చేశారు.

అమరావతి ప్రాంతంలో 144 సెక్షన్‌ పెట్టి గ్రామాలను దిగ్బంధించినా.. లాఠీ దెబ్బలు, అరెస్టులు, 600 మందిపై నమోదైన కేసులు పెట్టినా వెనక్కు తగ్గలేదు.

రైతులు ఉద్యమబాట పట్టారు. ఉద్యమంలో మొదటినుంచీ మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు.

పిల్లలు, వృద్ధులు కూడా భాగస్వాములయ్యారు. జాతీయ రహదారి దిగ్బంధం, అసెంబ్లీ ముట్టడి, కనకదుర్గమ్మకు మొక్కులు తీర్చుకునేందుకు మహిళల పాదయాత్ర.

జనవరిలో సమావేశాలు జరుగుతున్నప్పుడు అసెంబ్లీ ముట్టడి.

ఆ తర్వాత లాఠీఛార్జ్‌తో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

అమరావతి ఉద్యమం ఊపందుకున్న సమయంలో కరోనా ప్రభావం తాకింది.

లాక్‌డౌన్ ముందు వరకు సామాజిక దూరం పాటించిన రైతులు.. ఇప్పుడు రూటు మార్చారు.

కరోనా వైరస్ వ్యాప్తి ఉండటంతో దేశం మీద అభిమానంతో ప్రజల ఆరోగ్యం పై బాధ్యతతో ఎవరూ కూడా బయటకు రాకుండా..

దీక్షా శిబిరంలో పాల్గొన వద్దని, ఒకచోట సమావేశం కావొద్దని నిర్ణయించారు.

ఎవరి ఇంట్లో వారే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ అమరావతి ఉద్యమ దీక్షను కొనసాగిస్తూ దానికి సంబంధించిన ఫోటోలను మరియు వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

అందరూ మాస్కులను లేదా కర్చీఫ్ లను తప్పనిసరిగా ఉపయోగించాలని..

చేతులను ప్రతి గంటకు ఒకసారి శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు.స

రైతుల ఉద్యమంపై ప్రభుత్వం, మంత్రులు స్పందించారు.

వికేంద్రీకరణ కోసం మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నామని..

అమరావతి రైతులు సహకరించాలని కోరుతున్నారు. ఇక్కడి రైతులకు న్యాయం చేస్తామన్నారు.

ఆందోళనల్ని విరమించాలని కోరారు.

రైతుల్ని ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్ సానుకూలంగా ఉన్నారని చెబుతున్నారు.

కానీ రైతులు మాత్రం రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలనే డిమాండ్‌ను వినిపిస్తున్నారు.

ఇటు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడంపైనా వివాదం రేగింది.

తాము రాజధాని కోసం భూములు ఇస్తే.. పేదల ఇళ్ల కోసం ఎలా ఎలా కేటాయిస్తారని ప్రశ్నిస్తున్నారు.

భూముల సర్వే కోసం వచ్చిన రెవెన్యూ సిబ్బందిని వారు అడ్డుకున్న సంగతి తెలిసిందే.

ఉద్యమం 200 రోజులకు చేరినా రైతులు మాత్రం పట్టు వీడటం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *