రాజధాని అమరావతి నిర్మాణంలో నారా చంద్రబాబు, కడోలు పాల్గొన్నారు
రాఫ్ట్ ఫౌండేషన్ను కాంక్రీట్తో నింపే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం – రెండో టవర్ పునాదిని కాంక్రీట్తో నింపే కార్యక్రమం – మూడున్నర రోజులపాటు ఏకబిగిన కొనసాగనున్న కార్యక్రమం – 13 అడుగుల లోతు, 12 వేల క్యూబిక్ మీటర్ల మేర ఫౌండేషన్కు ఏర్పాట్లు – రాజధాని అమరావతిలోని రాయపూడి-కొండమరాజుపాలెం వద్ద కార్యక్రమం – ఐదు టవర్లుగా సచివాలయం, విభాగాధిపతుల భవనాల నిర్మాణం – 69.8 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంతో ఐదు టవర్లు – 40 అంతస్థులతో నాలుగు, 50 అంతస్థులతో ఒక భవనం – 5 సచివాలయ భవనాల్లో ఒకటి, రెండు టవర్లు షాపూర్జీ పల్లోంజి – 3,4 టవర్లను ఎల్అండ్టీ, ఐదో టవర్ను ఎన్సీసీ సంస్థలు నిర్మాణం .
సత్తెనపల్లి పట్టణంలో ఏనె.ఎస్.పీ (NSP) డివిజనల్ ఆఫీస్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు.
సాగర్ లో నీరు తక్కువగా ఉన్న నేపథ్యంలో రైతులు థాల్వ పంట వేయవద్దు..
వారాబంధీ ద్వారా రైతులు వేసిన ప్రతి ఎకరాకు నీరు ఇవ్వడం జరుగుతుంది.
రైతులు తగిన మొత్తంలో నీటిని ఉపయోగించుకుని కిందకు వదలాలి.
రైతులు పాత వ్యవసాయ పద్దతులు మాని ఆధునిక నూతన వ్యవసాయంపై దృష్టి పెట్టాలి.
ఈ ప్రభుత్వం రైతు ప్రభుత్వం రైతుల అభివృద్ధి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తుంది.
రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలోనే మొదటిసారి సత్తెనపల్లి మార్కెట్ యార్డు నుండి టెలీకాన్ఫరెన్స్ ద్వారా రైతులకు సలహలు, సూచనలు ఇవ్వడం జరుగుతుంది.
సత్తెనపల్లి NSP కాలనీని త్వరలో అధ్బుతంగా తీర్చిదిద్దాం.