2.5 కోట్లతో సన్మానం అనే ముసుగు నారాలోకేష్కి ….అసలు సన్మానం ఎందుకు? అంటే.. రీజన్ ఏమీలేదు. ఉత్తినే
ఏపీ పంచాయతీ రాజ్ శాఖామంత్రి నారాలోకేష్ బాబుకు ఉపాధిహామీ పథకంలోని ఉద్యోగుల తరఫు నుంచి సన్మానం చేస్తున్నారు.
విజయవాడ కేంద్రంగా జరిగే ఈ సన్మానానికి అవుతున్న ఖర్చు రెండున్నర కోట్ల రూపాయలు అని తెలుస్తోంది. అసలు సన్మానం ఎందుకు? అంటే.. రీజన్ ఏమీలేదు. ఉత్తినే.
ఎన్నికలు వస్తున్నాయి కదా.. ఉపాధిహామీ ఉద్యోగులకు జీతాలు పెంచే ప్రకటన ఒకటి చేస్తారట ఈ సన్మాన సభలో. ప్రకటన చేశాకా అయినా సన్మానం కాదు, సన్మాన సభలోనే ప్రకటన అంటూ.. రాష్ట్రవ్యాప్తంగా ఉపాధిహామీ పథకంలో పనిచేసే వారిని విజయవాడకు తరలించారు.
ఈ తరలింపులకు, సన్మాన ఏర్పాట్లకు.. కమిషన్లతో కలుపుకుని రెండున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారట.
ఉపాధిహామీకి కేంద్రం నుంచి వచ్చే నిధులను లోకేష్ సన్మానానికి వెచ్చిస్తున్నట్టుగా తెలుస్తోంది ఇదీ కథ.
ఉపాధిహామీ వాళ్లకు జీతాలు పెంచుతామని.. ఎన్నికల ముందు వారిని ప్రలోభ పెట్టే ప్రకటన చేయడానికి.. సన్మానం అనే ముసుగు వేసి.. ఉపాధిహామీ నిధులతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టి.. ఎన్నికల ప్రచారం గట్రా పనిని పూర్తి చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం తరఫు నుంచి ఇలాంటి కార్యక్రమాలు చాలానే జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వ సొమ్ముతోనే ఎన్నికల ప్రచారాన్ని పూర్తిచేసేలా ఉన్నారు.
కోడ్ వచ్చేలోపు కోట్ల రూపాయలను ఇలా చిల్లాడేలా ఉన్నారు!