నాలుగేళ్లలో 18 వేల కోట్లు-ఉపాధి పథకానికి… రాజ్యసభలో విజయ సాయి రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబు…

గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద నాలుగేళ్ల వ్యవధిలో ఏపీ కు 18 వేల 562 కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు.

రాజ్యసభలో సోమవారం వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు వి. విజయ్ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి రామ్ కృపాల్ యాదవ్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ కు 2015-16 లో 2856.85 కోట్లు, 2016-17 లో 3997.46 కోట్లు, 2017-18 లో 5287.32 కోట్లు 2018-19 లో ఫిబ్రవరి 5 నాటికి 6420.94 కోట్ల నిధులను కేంద్రం విడుదల చేసినట్లు ఆయన తెలిపారు.

ఉపాధి హామీ చట్టం కింద డిమాండ్ను బట్టి ఉపాధి కల్పించే పథకం ఇది.

అందువలన ఏ రాష్ట్రానికి కేటాయింపు ముందుగా జరగదని మంత్రి తెలిపారు.

ఈ పథకం కింద రాష్ట్రంలోని 13 జిల్లాల్లో డిమాండ్కు తగినట్లుగా ఉపాధి కల్పించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నట్లు తెలుపుతూ మంత్రి అందుకు అనుగుణంగా గాణాంకాలను వివరించారు.

ఈ పథకం అమలులో నిధులు దారి మళ్లింపు, అవకతవకలకు సంబంధించి తామ మంత్రిత్వ శాఖకు అంటే ఫిర్యాదులపై తగు విచారణ చర్యల కోసం పథకాన్ని అమలు చేస్తున్న ఆయా రాష్ట్రాలకు పంపించడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *