రానున్న ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ సిపి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సీట్లలో నెగ్గి ఘన విజయం సాధించ నున్నదని సర్వేలో వెల్లడి*


     మరి కొద్ది నెలల్లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ సిపి ఆంధ్రప్రదేశ్లో అత్యధిక సీట్లలోఘనవిజయం  సాధిస్తుందని." రిపబ్లిక్ టివి_ సి ఓటర్" సంస్థలో నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సీఎం చంద్రబాబు సారథ్యంలోని అధికార టిడిపి ఎంపి స్థానాలకు పరిమితమవుతుందని ఈ సర్వే తేల్చింది." నేషనల్ అప్రూవల్ రేటింగ్స్" పేరుతో జరిగిన ఈ సర్వే ఫలితాలను రిపబ్లిక్ టీవీ గురువారం విడుదల చేసింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో మొత్తం 25 లోక్సభ స్థానాల్లో వైఎస్సార్ సీపీకి 19 ఎంపీ సీట్లు. టిడిపిలో ఆరు సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది. జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్లుఏపిలొ ఒక్క స్థానంలో కూడా గెలవలేని పేర్కొంది.

        ఓట్ల శాతంలో ను వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యం.
              ఓట్ల శాతం పరంగా చూసినా కూడా సర్వేలో వైఎస్సార్ సీపీ పైచేయిగా ఉంది. వైయస్సార్ సిపి కి 41.3 శాతం ఓట్లు, టిడిపి కి 33.5% ఓట్లు దక్కే అవకాశం ఉన్నట్టు సర్వే వెల్లడించింది. 2014 లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేసిన ఏపీలో టిడిపికి 15 ఎంపీ సీట్లు మాత్రమే లభించడము గమనార్హం. బిజెపికి రెండు ఎంపీ సీట్లు రావడం తెలిసిందే. గత పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 8 ఎంపీ సీట్లు సాధించింది. సి వాటర్ సంస్థ గతంలో వెల్లడించిన సర్వేలో కూడా వైఎస్ఆర్సిపి ఘనవిజయం సాధిస్తుందని సంగతి తెలిసిందే. ఓట్ల పరంగా చూసినా 8.2% తేడాతో ఫ్యాన్ ప్రభంజనం ఉంటుందని అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *