కన్నకొడుకుని కొట్టి చంపిన కసాయి తల్లి.. విశాఖలో దారుణం

విశాఖపట్నం జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. కొడుకుని కన్నతల్లే అతి కిరాతకంగా హత్య చేసిన అమానుష ఘటన చోటుచేసుకుంది. అక్కయ్యపాలెం మండలం రామచంద్రనగర్‌కి చెందిన అశోక్ వర్మ తల్లి వరలక్ష్మి, అక్కాబావ శ్రీదేవి, వెంకటేశ్వరరాజుతో కలసి నివసిస్తున్నాడు. రాడ్ వెండర్‌గా పనిచేస్తున్న అశోక్ తాగుడుకు బానిసయ్యాడు. నిత్యం తాగొచ్చి తల్లితో.. అక్కతో గొడపడేవాడు.

శనివారం ఫుల్లుగా తాగొచ్చిన అశోక్ తన సోదరి శ్రీదేవితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. కొడుకు ప్రవర్తనతో విసుగుచెందిన తల్లి వరలక్ష్మి పక్కనే ఉన్న రోకలిబండతో తలపై కొట్టింది. దెబ్బ బలంగా తగలడంతో అశోక్ అక్కడే కుప్పకూలిపోయాడు. రక్తపు మడుగులో ప్రాణాలు వదిలాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. కన్నకొడుకుని హత్య చేసిన తల్లిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *