కడప నుంచీ ఈ సారి తన సతీమణి వైఎస్ భారతిని బరిలోకి దించాలని తాజాగా నిర్ణయం ఫిక్స్ చేసిన జగన్

వైసీపీ అధినేత కడపలో రాజకీయాలని వేడెక్కిస్తున్నారు.

అసలే కడప రాజకీయాలు ఏపీలో హాట్ టాపిక్ అంటే ఇప్పుడు జగన్ తీసుకున్న నిర్ణయం మరింత హాట్ న్యూస్ అనే చెప్పాలి.

గత కొన్ని రోజులుగా ఏపీలో పార్టీలు ఎంపీ ,అసెంబ్లీ అభ్యర్ధుల విషయంలో తర్జన భర్జన పడుతున్నాయి.

ఎవరిని ఈ స్థానంలో తీసుకోవాలి, వారి బలాబలాలు ఎంత. అనే కోణంలో తలమునకలు అవుతున్నాయి.

ఈ క్రమంలో వైసీపీ ఇప్పటికే అసెంబ్లీ, ఎంపీ స్థానాలపై ఓ క్లారిటీ కి వచ్చిందని అంటున్నారు అయితే.

కడప నుంచీ ఈ సారి తన సతీమణి వైఎస్ భారతిని బరిలోకి దించాలని తాజాగా నిర్ణయం తీసుకున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

2014 ఎన్నికల్లో కడప పార్లమెంటు నుంచీ అవినాష్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించిన విషయం తెలుసిందే.

అయితే ప్రత్యెక హోదా విషయంపై వైసీపీ ఎంపీలు అందరూ ముక్కుమ్మడిగా రాజీనామాలు కూడా చేశారు.

ఈ రాజీనామాలు చేసిన వారిలో అవినాష్ కూడా ఉన్నారు.

ఇదిలాఉంటే జమ్మలమడుగు నుంచీ వైసీపే తరుపున పోటీ చేసిన ఆ తరువాత మంత్రి పదవి కోసం టీడీపీ లోకి వెళ్ళిపోయినా మంత్రి ఆదినారాయణ రెడ్డి ని ఇప్పుడు బాబు కడప పార్లమెంటు స్థానం నుంచే పోటీ చేయించనున్నారట.

దాంతో జగన్ మొహన్ రెడ్డి తాజా పరిస్థితులకి అనుగుణంగా కడప నుంచీ వైఎస్ భారతిని దింపితే చంద్రబాబు ఎన్ని వ్యుహాలు రచించినా సరే గెలుపు వైసీపీ ఖాతాలోకి వచ్చి తీరుతుందని భావిస్తున్నారట.

అవినాష్ ని అసెంబ్లీ బరిలోకి దింపి అధికారం చేపట్టాక మంత్రి పదవి ఇవ్వనున్నారని తెలుస్తోంది.

అయితే ఈ విషయంపై జగన్ పార్టీ ముఖ్యులతో చర్చిస్తున్నారని ,మరింత క్లారిటీ వచ్చిన తరువాత అధికారిక ప్రకటన చేస్తారని అంటున్నారు.

మరి జగన్ భారతిని కడప ఎంపీ బరిలో దించుతారా లేదా అనేది త్వరలో తెలుస్తుంది అంటున్నారు పరిశీలకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *