అతిసార ( నీళ్ల విరేచనాలు ) హరించు యోగాలు –
- వెలగాకు రసం సేవించిన అతిసారం అణుగును .
- వేపచెట్టు పైన బెరడు తెచ్చి కషాయం చేసి కాని రసము తీసి కాని సేవించిన అతిసారం తగ్గును.
- పది తులముల వేడినీటిలో రెండు తులముల గుల్లసున్నం వేసి కొంతసేపు ఆగి తేరిన నీటిని తీసి దానిలో కొంచం నూనె , పంచదార కలిపి ఇవ్వవలెను. అతిసారం తగ్గును.
- నేరేడు చెట్టు బెరడు కషాయం కాని రసము గాని సేవించిన అతిసారం నివారించబడును.
- మేడిచెక్క రసము తీసి గాని , కషాయం గాని ఇవ్వవలెను.
- ఉసిరికపప్పు పిండిగా నూరి దానిని చిక్కగా అంబలి వలే కాచి దానిలో అల్లము రసము వేసి బొడ్డుచుట్టూ పట్టు వేసిన తీవ్రమైన అతిసారం అయినా తక్షణమే నయం అగును.
- మర్రిచిగుర్లు బియ్యము కడుగుతో నూరి తాగిన అతిసారం తగ్గును.
- ఉడుగు చెట్టు వేర్లు బియ్యపు కడుగుతో నూరి ముద్ద చేసి కుంకుడు గింజంత మాత్రలు చేసి మూడుపూటల సేవించిన అతిసారం కట్టును .
విజ్ఞానం మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి తెచ్చిందో చూడండి
మొదట : బావులలో నీరు త్రాగి వందేళ్ళు బ్రతికేవారు…
ఇప్పుడు : ఫిల్టర్ నీరు త్రాగుతూ 40 యేళ్ళకే ముసలి వాళ్ళం అయిపోతున్నాము…
.
మొదట : నూనె గింజలు గానుగ ఆడించిన నూనె తిని వృధాప్యములోనూ గట్టిగా వుండేవారు..
ఇప్పుడు : డబల్ ఫిల్టర్ రిఫైండ్ ఆయిల్ తింటూ కూడా చిన్న వయసులోనె హృదయాఘాతానికి గురి అవుతున్నాము..
మొదట : రాళ్ళ ఉప్పును సేవించినా ఆరోగ్యవంతులు గా వుండేవారు..
ఇప్పుడు : అయోడిన్ ఉప్పు సేవిస్తున్నా హై బీ.పి & బీ. పి తో బ్రతుకుతున్నాము..
మొదట : వేప పుల్లలు, బొగ్గు, ఉప్పుతో పల్లు తోమి 80 సంవత్సారాలలో కూడా చెరుకుగడలు చీల్చుకుని తినేవారు..
ఇప్పుడు : కోల్గేట్ తో పల్లుతోముతూ కూడా డెంటిస్ట్ దగ్గరకు పరుగెత్తుతాం..
మొదట : నాడి పట్టుకుని రోగం ఏంటో చెప్పేసేవారు
ఇప్పుడు : అన్ని స్కానింగ్లు చేసి కూడా రోగం ఏంటో చెప్పలేక పోతున్నారు
మొదట : 7 – 8 మందికి జన్మ నిచ్చిన తల్లి తన 80 వ యేట కూడ పొలం పనులు సునాయాసంగా చేసేది
ఇప్పుడు : మొదటి నెల నుండి వైద్యల పర్యవేక్షణలో వున్నా ఆపరేషన్ తోనే పిల్లలు పుడుతున్నారు
మొదట : బెల్లం పిండి వంటలను కడుపు నిండా తినేవారు
ఇప్పుడు : తినక ముండే షుగర్ వచ్చేసి వుంటుంది
మొదట : వృద్దుల కు కూడా కీళ్ళ నొప్పులు వుండేవి కావు
ఇప్పుడు : యవ్వన దశ నుండే కీళ్ళ జబ్బులు, నడుం నొప్పులు మొదలు అయిపోతున్నాయి
చివరగా
ఇది విజ్ఞానపు యుగమా లేక అజ్ఞానపు యుగమో తెలియడంలేదు విధి విచిత్రము కాకపోతే