కొత్త రిజర్వేషన్లపై రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయం వివిధ వర్గాల ప్రజలకు వరాల జల్లు

రాష్ట్ర మంత్రివర్గం వివిధ వర్గాల ప్రజలకు వరాల జల్లు కురిపించింది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు e w s లకు ఇచ్చే 10% రిజర్వేషన్లులొ 5% కాపులకు, మిగతా ఐదు శాతం ఇతర అన్ని అగ్రకులాల పేదలకు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అంశం పై సమగ్రంగా చర్చించి విధి విధానాలను అసెంబ్లీ ముందుకు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు.

ఈ డబుల్యు ఎస్ లకు పది శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం చట్టం చేసిన నేపథ్యంలో దాన్ని అమలు పై రాష్ట్ర మంత్రిమండలి చర్చించి నిర్ణయం తీసుకుంది. ఈమేరకు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మంత్రివర్గ సమావేశం వివరాలను వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టుకు ఖర్చు చేసిన 3,500 కోట్లతో పాటు ఇతరత్రా కేంద్రం నుంచి రావాల్సిన రక్షా మూడు వేల కోట్ల కోసం ప్రధానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాయనున్నారు.

కడప జిల్లాలో రైతులు అత్యధికంగా పండించే కేపీ రకం ఉల్లి 20.రూ. ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ధర పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్న ప్రభుత్వం జోక్యం చేసుకుని కొనుగోలు చేయనుంది. దీని వల్ల ప్రభుత్వంపై 20 కోట్ల భారం పడుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *