వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు…ముగ్గురు నిందుతుల్ని అరెస్ట్ చేశారు…

వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలనం.. పీఏ సహా ముగ్గురి అరెస్ట్.


వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక మలుపు. ఈ కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారని.. వివేకా ప్రధాన అనుచరుడు, పీఏతో పాటూ మరొకర్ని అరెస్ట్ చేసిన పులివెందుల పోలీసులు.

1.హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారని ఆరోపణలు
2.ముగ్గుర్ని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
3.ముగ్గురి అరెస్ట్‌తో వివేకా కేసులో కీలక మలుపు

ఏపీలో సంచలనం రేపిన మాజీ మంత్రి, వైసీపీ నేత వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ కేసుకు సంబంధించి.. మరో ముగ్గురు నిందుతుల్ని అరెస్ట్ చేశారు.

అరెస్టైన వారిలో వివేకా ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ఇంట్లో పనిచేసే లక్ష్మీ కుమారుడు ప్రకాష్‌లు ఉన్నారు. హత్య జరిగిన రోజు ఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేసినందుకు ఈ ముగ్గుర్ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ముగ్గురి అరెస్ట్‌కు సంబంధించి పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో ‘ఈ నెల 15న ఉదయం 8 గంటల సమయంలో వివేకానంద రెడ్డి పీఏ కృష్ణారెడ్డి పులివెందుల పోలీస్ స్టేషన్‌కు వచ్చారు. వివేకానందరెడ్డి చనిపోయారని ఫిర్యాదు చేశారు.

సదరు ఫిర్యాదుపై పులివెందులలో అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారు. తర్వాత శవపంచనామా సమయంలో సాక్ష్యాలు, రక్తపు మరకలు, బంధువుల చెప్పిన దానని బట్టి హత్యకేసుగా మార్చాము’అన్నారు.

దర్యాప్తులో భాగంగా తేలింది ఏంటంటే..ముద్దాయిలు వైఎస్ వివేకానందరెడ్డి మృతదేహాన్ని స్నానాల గది నుంచి బెడ్‌రూమ్‌లోకి తరలించారు.

బెడ్‌రూమ్‌లో ఉన్న రక్తపు ఆనవాళ్లను చెరిపేసి సాక్ష్యాధారాలను తారుమారు చేశారు.

పోలీస్ అధికారుల దర్యాప్తు చేపట్టక ముందే వివేకానందరెడ్డి శవాన్ని చాలా ఇంటి నుంచి అంబులెన్స్‌లో పులివెందుల గవర్నమెంట్ ఆస్పత్రి మార్చురీ గదికి మార్చారు

వివేకానందరెడ్డి తన మరణానికి కారణాలు తెలుపుతూ రాసిన లెటర్..

ఈ కేసులో ఫిర్యాది అయిన కృష్ణారెడ్డి దాచిపెట్టి.. మరణానికి కారణం తెలిసినా.. మరణానికి కారణం తెలియదు అని ఫిర్యాదు ఇచ్చాడు.

‘పై విధంగా సాక్ష్యాధారాలు తారుమూరు చేసినందుకు యెర్ర గంగిరెడ్డి క్రుష్ణారెడ్డి ప్రకాష్‌లను పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో అరెస్ట్ చేశాము’అని తెలిపారు.

వివేకా హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సిట్ 12 రోజుల పాటు 50మందికి పైగా సాక్షులను పోలీసులు విచారించి మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ ముగ్గురు నిందితులను పులివెందుల కోర్టుకు తీసుకొచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *