నేటి నుంచి వైఎస్ విజయమ్మ ఎన్నికల ప్రచారం…

ఇప్పుడు తన కుమారుడు జగన్‌కు తోడుగా వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రచారంలోకి దిగనున్నారు. నేటి(గురువారం) నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.

వైఎస్ విజయమ్మ నేటి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు.
ఇడుపులపాయలో వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించి పులివెందులలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం పుంజుకుంది. అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో పాటు ముఖ్య నేతలు, స్టార్ క్యాంపెయినర్లు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రత్యర్థులపై విమర్శల వర్షం కురిపిస్తూనే తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో ప్రజలకు వివరిస్తున్నారు.

ఎన్నికల ప్రచారంతో గ్రామగ్రామాన సందడి నెలకొంది. ప్రతిపక్షం వైసీపీ తరపున వైఎస్ జగన్ ప్రచారజోరు పెంచారు. ఎక్కడికెళ్లినా ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనను ఎండగడుతూ..

ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు. విజయమ్మ గత ఎన్నికల్లో విశాఖ నుంచి లోక్‌సభకు పోటీచేసి ఓటమి పాలయ్యారు.

ఇప్పుడు తన కుమారుడు జగన్‌కు తోడుగా వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ ప్రచారంలోకి దిగనున్నారు. నేటి(గురువారం) నుంచి విజయమ్మ ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు.

ఇడుపులపాయలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సమాధికి నివాళులర్పించిన అనంతరం ఆమె పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించనున్నారు.

శుక్రవారం నుంచి ఆదివారం వరకు ప్రకాశం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలో విజయమ్మ ప్రచారం నిర్వహించనున్నారు. జగన్ సోదరి వైఎస్ షర్మిళ శుక్రవారం గుంటూరు జిల్లా మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రచారం మొదలుపెట్టనున్నారు. విజయమ్మ, షర్మిళ కోసం వైసీపీ ఇప్పటికే ప్రచార రథాలను సిద్ధం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *