మన పైలట్‌‌ను పాక్ విడుదల చేస్తుందా? జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది?

పాక్ చెరలో ఉన్న భారత పైలట్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయా?

జెనీవా ఒప్పందం ఏం చెబుతోంది? కార్గిల్ యుద్ధంలో పట్టుబడిన యుద్ధ ఖైదీలను పాక్ ఏం చేసింది?

జెనీవా ఒప్పందం.. ఇలా చేస్తే అభినందన్ విడుదల సాధ్యమే!

1.జెనీవా ఒప్పందాన్ని 1929లో రూపొందించారు. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత 1949లో మరికొన్ని సవరణలు చేశారు.

2.యుద్ధంలో లేదా సరిహద్దులను దాటి పట్టుబడే జవాన్లు, ప్రజలతో ఎలా వ్యవహరించాలనేది జెనీవా ఒప్పందం చెబుతుంది.

3.కార్గిల్ యుద్ధంలో పట్టుబడ్డ IAF పైలట్ నచికేతను అంతర్జాతీయ ఒత్తిడితో పాక్ విడుదల చేసింది.

భారత గగనతలంలోకి చొచ్చుకొచ్చిన పాక్ యుద్ధ విమానాలను తరిమికొట్టే ప్రయత్నంలో భారత వైమానిక దళాని(IAF)కి చెందిన మిగ్-21 యుద్ధ విమానం పాకిస్థాన్‌లో కూలిపోయింది.

దీంతో అందులో ఉన్న IAF పైలట్‌ అభినందన్‌ను పాకిస్థాన్ ఆర్మీ అదుపులోకి తీసుకుంది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆయన్ని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు ఏం చేయనుంది?

పాక్ మన పైలట్‌ను తిరిగి అప్పగిస్తుందా, లేదా అనే ప్రశ్నలు వెలువడుతున్నాయి.

ఈ సందర్భంగా జెనీవా ఒప్పందంపై కూడా జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ జెనీవా ఒప్పందం అంటే ఏమిటీ? అందులో పేర్కొన్న అంశాలేమిటో చూద్దాం.

మొదటి జెనీవా ఒప్పందం 1864లో జరిగింది.

1906, 1929లో మరికొన్ని సవరణలు చేశారు.

రెండో ప్రపంచం యుద్ధం తర్వాత 1949లో ఈ ఒప్పందానికి తుది రూపం ఇచ్చారు.

మానవ హక్కుల పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి ఈ మార్గదర్శకాలను రూపొందించింది.

యుద్ధంలో లేదా సరిహద్దులను దాటి పట్టుబడే జవాన్లు, ప్రజలతో ఎలా వ్యవహరించాలనేది జెనీవా ఒప్పందం చెబుతుంది.

యుద్ధ ఖైదీల హక్కులపై జెనీవా నిర్వహించిన సమావేశంలో పలు కీలక విషయాలను పొందుపరిచారు.

1949లో రూపొందించిన ఈ ఒప్పందంలో మొత్తం నాలుగు సవరణలు చేశారు.

మొదటి సవరణలో అనారోగ్యం లేదా గాయాలతో పట్టుబడే సైనికులను వారి రంగు, ప్రాంతం, మతం, లింగ బేధాలు, ధనం వంటి ఆధారాలతో వేధించకూడదు

పట్టుబడిన సైనికులతో మానవత్వంతో వ్యవహరించాలి. వారిని హింసించడం లేదా ఉరి తీయడం చేయకూడదు.

గాయపడినా, అనారోగ్యంతో ఉన్నవారికి తక్షణం వైద్య సేవలు అందించాలి.
నావికా, వైమానిక దళాలను కూడా చేర్చుతూ రెండో సవరణ చేశారు.

మూడో సవరణ ప్రకారం.. పట్టుబడిన జవాన్ల ర్యాంకులు, సీరియల్ నెంబర్లు మాత్రమే తీసుకోవాలి.

వారి దేశ రహస్యాలు తెలుసుకోడానికి హింసించరాదు.

పట్టుబడిన జవాన్లకు లేదా యుద్ధ ఖైదీలకు రక్షణ కల్పించే బాధ్యత కూడా ఆ దేశానిదేనని నాలుగో సవరణలో స్పష్టం చేసింది.

జవాన్లను యుద్ధ ఖైదీలుగా పట్టుకుంటే.. తిరిగి వారిని స్వదేశానికి అప్పగించాల్సి ఉంటుంది.

అంతర్జాతీయంగా ఒత్తిడి తెస్తే సాధ్యమే: పాక్ చెరలో ఉన్న పైలట్‌ అభినందన్‌ను తిరిగి స్వదేశానికి తీసుకురాగలమా అనే ప్రశ్నకు..

భారత వైమానిక దళానికి చెందిన పైలట్ నచికేత ఘటనే నిదర్శనం.

1999లో జరిగిన కార్గిల్ యుద్ధంలో ఆయన నడుపుతున్న యుద్ధ విమానం పాక్ సరిహద్దుల్లో కూలిపోయింది.

ప్రాణాలతో బయటపడ్డ నచికేత పాక్ సైనికులకు తన వద్ద ఉన్న రహస్య డాక్యుమెంట్లు, సైనిక సమాచారం లభించకుండా తగలబెట్టేశారు.

నచికేతను అదుపులోకి తీసుకున్న ఆయన్ని తీవ్రంగా హింసించారు. 1999, జూన్ 3 వరకు నచికేతను యుద్ధ ఖైదీగా బంధించారు.

ఆయన్ను బయటకు తీసుకు వచ్చేందుకు అప్పటి ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో పాక్‌పై ఒత్తిడి తెచ్చారు. దీంతో పాక్ నచికేతను విడిచిపెట్టింది.

నచికేతను విడిపించేందుకు అప్పటి భారత హైకమిషనర్ పార్థసారథి ఎంతో ప్రయత్నించారు.

ఈ నేపథ్యంలో అభినందన్‌‌ను విడుదలకు ప్రభుత్వం ఇదే మార్గాన్ని ఎంచుకునే అవకాశాలున్నాయి. పాక్‌పై ఒత్తిడి తెచ్చినట్లయితే అభినందన్ సురక్షితంగా స్వదేశానికి తిరిగి వస్తారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *