గతంలో ఒక తప్పు చేసి బాధపడుతున్నాము మరల అదే తప్పు మేము ఎందుకు చేయాలని అనుకుంటాము… పార్టీ మార్పుపై ఎమ్మెల్యే భర్త క్లారిటీ

మా కుటుంబం ఎప్పటి నుంచో కొనసాగుతుంది. మేము ఎందుకు టీడీపీ వదిలి వెళ్లాలని అనుకుంటాము ఎమ్మెల్యే భవానీ భర్త శ్రీనివాస్.

గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఆదిరెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతుంది అన్నారు రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే భవానీ భర్త శ్రీనివాస్.

తన రాజకీయ భవిష్యత్తు కోసం ఆదిరెడ్డి భవానీ.. తన కుటుంబ సభ్యులు కానీ పార్టీ మారాల్సిన పని లేదన్నారు. తాము పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని.. దానిని నమ్మాల్సిన పని లేదన్నారు. టీడీపీ తమ కుటుంబానికి ఎంతో గౌరవం.. రాజకీయంగా ఎదగటానికి పార్టీ ఎంతో స్వేచ్ఛ ఇస్తోందన్నారు. కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

టీడీపీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాలని.. పార్టీ మారతారని.. అసంతృప్తి ఉందనో.. స్కాంలలో ఇరుక్కున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు శ్రీనివాస్.

అచ్చెన్నాయుడును పట్టించుకోలేదని తాము పార్టీ వీడుతామని చెబుతున్నారని.. అధిష్టానం అచ్చెన్న కోసం పోరాటం చేస్తోందని గుర్తు చేశారు.

మూడు దశాబ్దాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉందని.. ఓ తప్పు చేసి గతంలో వైఎస్సార్‌సీపీలోకి వెళ్లామన్నారు. 2007 నుంచి 2012 తన తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్‌గా ఉన్నారని.. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో మొత్తం 14 కార్పొరేషన్లలో 13 అధికార పార్టీ కైవసం చేసుకుంటే.. రాజమండ్రి మాత్రం టీడీపీ గెలిచింది తన తల్లి వీరరాఘవమ్మ మేయర్ అయ్యారని గుర్తు చేశారు.

ఆ తర్వాత స్థానిక సమస్యలతో వైఎస్సార్‌సీపీలో చేరామని.. అప్పుడు కూడా చంద్రబాబుతో ఎలాంటి విభేదాలు లేవన్నారు. మూడేళ్లు పార్టీలో ఉన్నాం.. పార్టీ మారినా నీతిగా పనిచేశాం.. వ్యక్తిత్వాన్ని కోల్పోలేదన్నారు.

ఆ పార్టీలో గౌరవం లేదని టీడీపీలోకి మళ్లీ వచ్చామని.. తాను టికెట్ ఆశించిన మాట వాస్తవమేనని.. కానీ మహిళకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం భావించిందని.. చంద్రబాబు మాటను గౌరవించాం.. ఆయన చెప్పినట్లుగా భవానికి సీటు ఇచ్చారు.. గెలిచామన్నారు.

ప్రజలు తమపై నమ్మకంతో 30వేల మెజార్టీ ఇచ్చారన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలను ఇబ్బంది పెట్టాలని.. పార్టీ మారతారని.. అసంతృప్తి ఉందనో.. స్కాంలలో ఇరుక్కున్నారని ప్రచారం చేస్తున్నారన్నారు శ్రీనివాస్.

అచ్చెన్నాయుడును పట్టించుకోలేదని తాము పార్టీ వీడుతామని చెబుతున్నారని.. అధిష్టానం అచ్చెన్న కోసం పోరాటం చేస్తోందని గుర్తు చేశారు. పార్టీల్లో ఇబ్బందులు సహజమని.. వైఎస్సార్‌సీపీలో లేవా అంటూ వాసు ప్రశ్నించారు.

పార్టీ తమ కుటుంబానికి గౌరవం ఇస్తోందని.. తన తండ్రిని అనకాపల్లి స్థానిక సంస్థల ఎన్నికల అబ్జర్వర్‌గా నియమించారని.. యువనేతగా ఉన్న తనకు కీలకమైన కర్నూలు పార్లమెంట్ బాధ్యతలు అప్పగించారని గుర్తు చేశారు.

పార్టీ అలాంటి గౌరవం, స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు తాము పార్టీ మారాల్సిన అవసరంలేదని.. ఇప్పటికైనా వైఎస్సార్‌సీపీ తమపై తప్పుడు ప్రచారం చేయడం మానుకుంటే మంచిదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *