Vizag Metro: విశాఖవాసులకు గుడ్‌న్యూస్.. ఆ కల నెరవేరబోతోంది

ట్రామ్‌కు సంబంధించి బ్రెజిల్, స్పెయిన్, దుబాయ్, ఫ్రాన్స్‌ దేశాల ప్రాజెక్ట్‌ల వివరాలు సేకరిస్తున్నారు.

డీపీఆర్‌ సిద్ధమైతే ఈ అంచనా వ్యయాల్లో స్వల్ప మార్పులుండనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది చివరి నాటికల్లా లైట్‌ మెట్రో, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్లకు డీపీఆర్‌లు పూర్తి అయితే.. వాటిని ప్రభుత్వం అధ్యయనం చేసిన వెంటనే బిడ్డింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టుకు ముందడుగులు పడుతున్నాయి. లైట్‌ మెట్రో రైలు, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్‌లకు సంబంధించిన డీపీఆర్ అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ సిద్ధం చేస్తోంది.

ఒక కి.మీ ట్రామ్‌ కారిడార్‌ నిర్మించేందుకు రూ.100 కోట్లు నుంచి రూ.120 కోట్లు మాత్రమే ఖర్చవుతుందని భావిస్తున్నారు.

మొత్తం 79.91 కి.మీ మేర లైట్‌ మెట్రో ప్రాజెక్ట్‌ నిర్మాణానికి సుమారు రూ.16,000 కోట్లు, 60.20 కి.మీ మేర ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణానికి రూ.7,320 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు.

డీపీఆర్ బాధ్యతల్ని అర్బన్‌ మాస్‌ ట్రాన్సిస్ట్‌ కంపెనీ లిమిటెడ్‌కు ప్రభుత్వం అప్పగించింది. లైట్‌ మెట్రోతో పోలిస్తే ట్రామ్‌ కారిడార్‌ నిర్మాణం తక్కువ ఖర్చు అవుతుందని భావిస్తున్నారు.

లైట్‌ మెట్రో రైలు కారిడార్‌ నిర్మాణానికి ఒక కిలోమీటరుకు రూ.200 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు.

ట్రామ్‌ కారిడార్‌కు రూ.100 నుంచి రూ.120 కోట్లు అవుతుంది అంటున్నారు.

ఇక డీపీఆర్‌ల విషయానికి వస్తే.. లైట్‌ మెట్రోకు సంబంధించిన డీపీఆర్‌ని నవంబర్‌.. ట్రామ్‌ కారిడార్‌కు సంబంధించిన డీపీఆర్‌ని డిసెంబర్‌ నెలాఖరుకల్లా ప్రభుత్వానికి చేరనున్నాయి.

నగరంలో ట్రాఫిక్‌.. 2050 నాటికి జరగనున్న మార్పులు, పెరగనున్న ట్రాఫిక్‌ మొదలైన అంచనాలతో డీపీఆర్‌ తయారవుతోంది.

ట్రామ్‌కు సంబంధించి బ్రెజిల్, స్పెయిన్, దుబాయ్, ఫ్రాన్స్‌ దేశాల ప్రాజెక్ట్‌ల వివరాలు సేకరిస్తున్నారు.

డీపీఆర్‌ సిద్ధమైతే ఈ అంచనా వ్యయాల్లో స్వల్ప మార్పులుండనున్నాయని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ఈ ఏడాది చివరి నాటికల్లా లైట్‌ మెట్రో, మోడ్రన్‌ ట్రామ్‌ కారిడార్లకు డీపీఆర్‌లు పూర్తి అయితే.. వాటిని ప్రభుత్వం అధ్యయనం చేసిన వెంటనే బిడ్డింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

పరిస్థితులన్నీ అనుకూలిస్తే మార్చి 2021 నాటికి పనులకు సంబంధించి అగ్రిమెంట్‌ పూర్తిచేసి.. 2021 జూన్‌ నాటికి లైట్‌ మెట్రో కారిడార్‌ పనులు ప్రారంభించి.. మార్చి 2024 నాటికి లైట్‌ మెట్రోలో ఒక కారిడార్‌ నుంచి మెట్రో రైలు పరుగులు తీస్తుందని భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *