తొలి స్వదేశీ సోషల్ మీడియా యాప్‌ను ఆవిష్కరించిన వెంకయ్య

చైనాకు చెందిన 59 యాప్‌లపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో ప్రస్తుతం దేశీయంగా యాప్‌ల తయారీపై చర్చ సాగుతోంది.

ప్రధాని నరేంద్ర మోదీ సైతం దేశీయ యాప్‌లను రూపొందించాలని పిలుపునిచ్చారు.

సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకున్న వేళ చైనాకు సరైన గుణపాఠం చెప్పాలని భారత్ సంకల్పించింది.

ఇందులో భాగంగా చైనాకు చెందిన 59 మొబైల్ యాప్స్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో దేశీయ యాప్‌ల రూపకల్పన ఊపందుకుంది.

తొలి దేశీయ సోషల్ మీడియా సూపర్ యాప్‌‌ను ఉప-రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆదివారం ఆవిష్కరించారు.

ఎలిమెంట్స్ యాప్‌ను విర్చువల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించిన వెంకయ్య నాయుడు.. విదేశీ యాప్‌లకు దీటుగా నిలవాలని ఆకాంక్షించారు.

ఇలాంటి దేశీయ యాప్‌లు మరిన్ని రావాలని ఆయన అన్నారు. గురు పౌర్ణమి రోజున యాప్‌ను ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉందని ఉప-రాష్ట్రపతి వ్యాఖ్యానించారు.

ఆత్మ నిర్బర్ భారత్‌ కోసం ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారని, దీని ద్వారా గ్రామాలు, పట్టణాల మధ్య సమన్వయం ఏర్పడుతుందన్నారు.

మేడిస్ ఇండియాపై అన్ని ప్రాంతాల్లోనూ చైతన్యం వచ్చిందని, దేశంలోని వనరులను వ్యూహాత్మకంగా వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ కూడా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *