డిగ్రీ, పీజీ, బీటెక్ వంటి ఉన్నత విద్యాకోర్సుల విద్యార్థులకు సెప్టెంబర్లోగా పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు చర్యలు చేపడుతున్నాయి!

AP: డిగ్రీ, పీజీ, బీటెక్ విద్యార్థులకు అలర్ట్.. ఎప్పటికప్పుడు వర్సిటీలతో టచ్లో ఉండండి..!
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్లోగా పరీక్షలు నిర్వహించేలా వర్సిటీలు ప్రణాళిక రూపొందించే పనిలో నిమగ్నమయ్యాయి.
1.అక్కడే పరీక్షలు..?
2.జాబితా రూపకల్పన దిశగా వర్సిటీలు
డిగ్రీ, పీజీ, బీటెక్ వంటి ఉన్నత విద్యాకోర్సుల విద్యార్థులకు సెప్టెంబర్లోగా పరీక్షల నిర్వహణకు రాష్ట్రంలోని యూనివర్సిటీలు చర్యలు చేపడుతున్నాయి.
విద్యార్థుల భవిష్యత్తు, ఉద్యోగావకాశాలు, ఇతర అంశాల దృష్ట్యా పరీక్షలు నిర్వహించాలని యూజీసీ, కేంద్ర మానవ వనరులశాఖ (హెచ్ఆర్డీ) స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు వీలుగా ప్రభుత్వం ఆయా వర్సిటీలకు బాధ్యతలు అప్పగిస్తోంది.
యూజీసీ మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్లోగా పరీక్షలు నిర్వహించేలా వర్సిటీలకు సూచిస్తున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఇటీవల ప్రకటించారు.
ఏపీలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీలు 54 ఉండగా అందులో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు 30 ఉన్నాయి.
వీటి పరిధిలో 3,285 కాలేజీలు యూజీ, పీజీ సహా వివిధ కోర్సులు నిర్వహిస్తున్నాయి.
ఆంధ్రా యూనివర్సిటీ, జేఎన్టీయూ కాకినాడ, అనంతపురం, శ్రీవేంకటేశ్వర, శ్రీకృష్ణదేవరాయ, నాగార్జున వర్సిటీల పరిధిలో ఎక్కువగా అఫ్లియేటెడ్ కాలేజీలున్నాయి.
ఆంధ్రా వర్సిటీలో విద్యనభ్యసిస్తున్న విదేశీ విద్యార్థులు 600 వరకు ఉన్నారు.
పరీక్షల నిర్వహణలో వీరిని కూడా పరిగణనలోకి తీసుకొని ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
సహేతుక కారణాలతో పరీక్షలు రాయలేని వారికి తరువాత ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించే విధంగా ఆలోచనలు చేస్తున్నారు.
ఎక్కడి వారికి అక్కడే పరీక్షలు:
పరీక్షల నిర్వహణపై యూజీసీ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం.
విద్యార్థులు యూనివర్సిటీ పరిధి దాటి బయటి ప్రాంతాల్లో ఉంటే వారికి అక్కడ అందుబాటులో ఉన్న కాలేజీలో పరీక్షలు నిర్వహించాలని సూచించాం.
ఇందుకు అనుగుణంగా ప్రతి వర్సిటీ తన పరిధిలోని విద్యార్థులు ఎక్కడ ఉన్నారో సమాచారం సిద్ధం చేసుకోవాలి.
జేఎన్టీయూల సాంకేతిక సహకారంతో ఇతర ప్రాంతాలకు ప్రశ్నపత్రాలు పంపి పరీక్షలు నిర్వహించాలని సూచించాం.