విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకే.. అగ్ర తాంబూలం.. ఏకంగా రూ. 86.5 వేల కోట్లు కేటాయింపు

ఆ 4 రంగాలకే అగ్ర తాంబూలం.. ఏకంగా రూ. 86.5 వేల కోట్లు కేటాయింపు

ఏపీ ప్రభుత్వం నాలుగు రంగాలకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చింది. కేవలం నాలుగు రంగాలకే ఏకంగా రూ. 86.5 వేల కోట్ల నిధులు కేటాయించింది.

ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శాసనసభలో వరుసగా రెండోసారి పెట్టిన రాష్ట్ర బడ్జెట్‌లో పలు రంగాలకు భారీగా నిధులు కేటాయించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమ రంగాలకే దాదాపు బడ్జెట్‌లో అత్యధిక శాతం కేటాయింపులు చేశారు. అట్టడుగున ఉన్న పేద ప్రజలను ఆర్థికసాయం ద్వారా పైకితీసుకు రావాలని, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మార్చాలని సీఎం తీసుకున్న నిర్ణయాలు సవాళ్లుగా మారాయని వివరించారు. గత ప్రభుత్వం ఇష్టానుసారంగా ప్రజాధనాన్ని ఖర్చు చేసే విధానాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని స్పష్టం చేశారు.

బడ్జెట్‌ కేటాయింపులు ఇలా
బడ్జెట్‌ అంచనా వ్యయం రూ.2,24,789.18 కోట్లు
రెవెన్యూ వ్యయం అంచనా రూ.1,80,392.65 కోట్లు
మూలధన వ్యయం అంచనా రూ.44,396.54 కోట్లు

రంగాల వారీగా కేటాయింపులు
వ్యవసాయం: రూ.11,891 కోట్లు
జనరల్ ఎడ్యుకేషన్: రూ. 25,201.35 కోట్లు
సాంకేతిక విద్య: రూ. 348.31 కోట్లు
వైద్యం: రూ. 11419.48 కోట్లు
సంక్షేమ పథకాలు (నవరత్నాలు): రూ. 37,659.05 కోట్లు

వివిధ రంగాలకు కేటాయింపులు
వైఎస్సార్‌ రైతు భరోసా రూ.3,615 కోట్లు
ధరల స్థిరీకరణ నిధి రూ.3వేల కోట్లు
వడ్డీలేని రుణాల కోసం రూ.1100 కోట్లు
బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు
మైనార్టీల సక్షేమానికి రూ.1998 కోట్లు
ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు
ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు
కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు
వైద్య రంగానికి రూ.11,419 కోట్లు
ఆరోగ్యశ్రీకి రూ.2,100 కోట్లు
వైఎస్‌ఆర్‌ గృహ వసతికి రూ.3వేల కోట్లు
పీఎం ఆవాస్‌ యోజన(అర్బన్‌) రూ.2,540 కోట్లు
పీఎం ఆవస్‌యోజన(గ్రామీణం) రూ.500 కోట్లు
బలహీన వర్గాల గృహనిర్మాణానికి రూ.150 కోట్లు
రేషన్‌ బియ్యానికి రూ.3,000 కోట్లు
డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు
రూ.8వేల కోట్లతో 30లక్షల ఇళ్ల పట్టాలు
అభివృద్ధి పథకాలకు రూ.84,140.97 కోట్లు
షెడ్యూల్డుకులాల అభివృద్ధికి రూ.15,735.68 కోట్లు
షెడ్యూల్డు తెగలకు రూ.5,177.53 కోట్లు
బీసీల అభివృద్ధికి రూ.25,331.30 కోట్లు. బీసీ కులాలకు గతంలో పోలిస్తే 68.18శాతం అధికం
మైనార్టీల అభివృద్ధికి 2050.22 కోట్లు. మైనార్టీలకు గతేడాదితో పోలిస్తే 116.10శాతం అధికం.
జగనన్న చేదోడు పథకానికి 247 కోట్లు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *