మోదీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై టైమ్స్ గ్రూప్ ఆన్‌లైన్‌ పోల్ చేపట్టింది

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానిగా మోదీని ఎన్నుకుంటామని 84 శాతం మంది తెలిపారు.

మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం ఏంటనే ప్రశ్నకు ఆశ్చర్యం కలిగించే సమాధానం వచ్చింది.

ఎన్నికలు సమీపిస్తోన్న తరుణంలో మోదీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనపై టెమ్స్ గ్రూప్ ఆన్‌లైన్‌ పోల్ చేపట్టింది.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానిగా మోదీని ఎన్నుకుంటామని 84 శాతం మంది తెలిపారు.

మోదీ సర్కారు అతిపెద్ద వైఫల్యం ఏంటనే ప్రశ్నకు ఆశ్చర్యం కలిగించే సమాధానం వచ్చింది.

ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. టైమ్స్ గ్రూప్ నిర్వహించిన మెగా ఆన్‌లైన్ పోల్‌లో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

ఎన్నికల తర్వాత మోదీ సారథ్యంలోని ఎన్డీయే కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఈ పోల్‌లో పాల్గొన్నవారిలో 83 శాతం మంది అభిప్రాయపడ్డారు.

2 లక్షల మందికి పైగా ఈ పోల్‌లో పాల్గొనగా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ప్రధానిగా మోదీని ఎన్నుకుంటామని 84 శాతం మంది తెలిపారు.

ప్రధానిగా రాహుల్ అభ్యర్థిత్వం పట్ల 8.33 శాతం మంది మాత్రమే సుముఖంగా ఉన్నారు.

టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రధాని కావాలని 1.44 శాతం, మాయావతి పీఎం కావాలని 0.43 శాతం మంది ఆశిస్తుండగా..

ఇతరులు ప్రధాని పీఠంపై కూర్చోవాలని 5.9 శాతం మంది భావిస్తున్నారు.

2014తో పోలిస్తే రాహుల్ పాపులారిటీ పెరిగిందా? అనే ప్రశ్నకు 31 శాతం మంది సానుకూలంగా స్పందించారు. 63 శాతం మంది పెరగలేదని చెప్పడం గమనార్హం.

లోక్‌సభ ఎన్నికల తర్వాత ఎన్డీయే, యూపీఏ యేతర కూటమి ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉందని 3.47 శాతం మాత్రమే అభిప్రాయపడ్డారు.

మోదీ ఐదేళ్ల పాలన ఎలా ఉందనే ప్రశ్నకు 59.51 శాతం మంది చాలా బాగుందని బదులిచ్చారు.

22.29 శాతం మంది బాగుందని, 8.25 శాతం మంది ఫర్వాలేదని చెప్పారు. కాగా, 9.9 శాతం మంది
మోదీ పాలన పట్ల పెదవి విరిచారు.

మోదీ ప్రభుత్వం సాధించిన అతిపెద్ద విజయం, అతిపెద్ద ఫెయిల్యూర్ ఏంటని ప్రశ్నించగా..

సంక్షేమ, అభివృద్ధి పథకాల ద్వారా పేదలకు సౌకర్యాలను చేరువ చేయడం మోదీ ప్రభుత్వ అతిపెద్ద విజయమని 34.39 శాతం మంది అభిప్రాయపడ్డారు. జీఎస్టీ అమలుకు 29 శాతం మంది ఓటేశారు.

మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం రామ మందిర నిర్మాణంలో పురోగతి లేకపోవడమేనని 35.72 శాతం మంది అభిప్రాయపడటం ఆశ్చర్యం కలిగించే విషయం.

ఉద్యోగాల కల్పనలో వైఫల్యం (29.5 శాతం) తర్వాతి స్థానంలో ఉంది.

వచ్చే ఎన్నికల్లో మీ ప్రధాన సమస్య ఏంటని ప్రశ్నించగా..

ఉద్యోగాల కల్పనేనని 40.20 శాతం మంది అభిప్రాయపడటం నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.

రైతుల సమస్యలు (21.80 శాతం) రెండో స్థానంలో ఉన్నాయి.

మోదీ వైఫల్యాల్లో ‘రామ మందిరం’ మొదటి స్థానంలో నిలిచినప్పటికీ.. లోక్‌సభ ఎన్నికల్లో ఈ సమస్య ప్రధానమైందని పది శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు.

మోదీ పాలనలో మైనార్టీలో అభద్రతా భావం పెరిగిందా? అని ప్రశ్నించగా..

లేదని 65.5 శాతం మంది అభిప్రాయపడ్డారు. 24.2 శాతం మంది మాత్రం పెరిగిందని బదులిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *