జనసేన తొలి జాబితా… 8 అప్లికేషన్లకు అవకాశం…

జనసేన తొలి జాబితాను బుధవారం అర్థరాత్రి దాటిన తర్వాత ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ విడుదల చేశారు.
పార్లమెంటుకు నలుగురిని అసెంబ్లీకి 32 మందిని తొలివిడతగా ఎంపిక చేశారు.
జనసేన పార్టీ అభ్యర్థిత్వం కోసం తొలుత కొత్త వారి నుంచి అప్లికేషన్స్ను ఆహ్వానించారు.
పవన్ కళ్యాణ్ అభిమానులు వేల సంఖ్యలో ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ దరఖాస్తులను నుంచి తొలివిడతగా ఎనిమిది మందికి జనసేన నుంచి పోటీ చేసే అవకాశాన్ని పవన్ కళ్యాణ్ కల్పించారు.
పవన్ బుధవారం రాత్రి మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో అభ్యర్థులతో మాట్లాడిన తర్వాత ఈ పేర్లు ఖరారయ్యాయి. ఖరారైన అభ్యర్థుల వివరాలు
పార్లమెంటు అభ్యర్ధులు:
- అమలాపురం- డి.ఎం.ఆర్ శేఖర్
- రాజమండ్రి- డాక్టర్ ఆకుల సత్యనారాయణ
- విశాఖపట్నం- గేదెల శ్రీనుబాబు
- అనకాపల్లి- చింతల పార్ధసారధి
శాసనసభ అభ్యర్ధులు:
- యలమంచిలి- సుందరపు విజయ్కుమార్,
- పాయకరావుపేట- నక్కా రాజబాబు
- పాడేరు – పసుపులేటి బాలరాజు
- రాజాం- డాక్టర్ ముచ్చా శ్రీనివాసరావు
- .శ్రీకాకుళం- కోరాడ సర్వేశ్వరరావు
- పలాస- కోత పూర్ణచంద్రరావు
- ఎచ్చెర్ల- బాడన వెంకట జనార్ధన్ (జనా)
- నెల్లిమర్ల- లోకం నాగమాధవి
- తుని- రాజా అశోక్బాబు
- రాజమండ్రి సిటీ- కందుల దుర్గేష్
- రాజోలు- రాపాక వరప్రసాద్
- పి.గన్నవరం- పాముల రాజేశ్వరి
- కాకినాడ సిటీ- ముత్తా శశిధర్
- అనపర్తి- రేలంగి నాగేశ్వరరావు
- ముమ్మిడివరం- పితాని బాలకృష్ణ
- మండపేట- వేగుళ్ల లీలాకృష్ణ
- తాడేపల్లిగూడెం- బొలిశెట్టి శ్రీనివాస్
- ఉంగుటూరు- నవుడు వెంకటరమణ
- ఏలూరు- రెడ్డి అప్పలనాయుడు
- తెనాలి- నాదెండ్ల మనోహర్
- గుంటూరు వెస్ట్ – తోట చంద్రశేఖర్
- పత్తిపాడు- రావెల కిషోర్బాబు
- వేమూరు- డాక్టర్ ఎ.భరత్ భూషణ్
- నరసరావుపేట- సయ్యద్ జిలానీ
- కావలి- పసుపులేటి సుధాకర్
- నెల్లూరు రూరల్- చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి
- ఆదోని- మల్లిఖార్జునరావు(మల్లప్ప)
- ధర్మవరం- మధుసూదన్రెడ్డి
- రాజంపేట- పత్తిపాటి కుసుమకుమారి
- రైల్వే కోడూరు- డాక్టర్ బోనాసి వెంకటసుబ్బయ్య
- పుంగనూరు- బోడే రామచంద్ర యాదవ్
- మచిలీపట్నం- బండి రామకృష్ణ