చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయం పట్టుకుందని.. అందుకే సుజనాను రంగంలోకి దించారని విమర్శలు.

లులూ గ్రూప్ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే చంద్రబాబు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించినవిజయసాయిరెడ్డి. చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా పోతుందని భయం పట్టుకుందని.. అందుకే సుజనాను రంగంలోకి దించారని విమర్శలు.

‘Chandrababu Naiduకు భయం మొదలయ్యింది.. అందుకే ఇలా..’

టీడీపీ నేతలు, అధినేత చంద్రబాబుపై ట్విట్టర్‌లో మరోసారి విరుచుకుపడ్డారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. లులూ గ్రూప్ విశాఖ నుంచి వెళ్లిపోవడానికి.. ఏపీలో పెట్టుబడులు పెట్టమని చెప్పడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.

లులూ సంస్థ రాష్ట్రం నుంచి వెళ్లిపోతే తెగ గుండెలు బాదుకుంటున్నారని.. బాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఎక్కడ పోతుందనే భయం పట్టుకుందని విమర్శించారు.

లులూ గ్రూప్ కు వైజాగ్ నడిబొడ్డున 14 ఎకరాల భూమిని చంద్రబాబు ఉదారంగా కట్టబెట్టారని ఆరోపించారు. దీనికి ఎంత కమిషన్ ముట్టిందో త్వరలోనే బయటపడుతుందన్నారు.

వాళ్ల పెట్టుబడికి అంత భూమి అవసరం లేదని ప్రభుత్వం రద్దు చేసిందని.. దీనిపై లులూ సంస్థ కంటే చంద్రబాబే ఎక్కువ గుండెలు బాదుకుంటున్నారని ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి.

తన పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి బిజెపిలోకి పంపించిన ‘కోవర్టు’ను చంద్రబాబు రంగంలోకి దించారన్నారు.

ప్రతిపక్ష హోదా ఎక్కడ జారిపోతుందో అని భయం పట్టుకుందని… అందుకే ‘కోవర్టు’ ద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు బిజెపీతో టచ్ లో ఉన్నారని చెప్పించారని ఆరోపించారు. అబద్ధానికీ ఒక హద్దుండాలని మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *