బట్టబయలైన ప్రశ్నలు… సీపీ అంజనీ కుమార్ చెప్పిన నిజాలు…

సీపీ అంజనీ కుమార్ కీలక విషయాలు బయటపెట్టారు డేటా చోరీ, ఏపీ ప్రజల ఓట్ల తొలగింపు కేసులో కొత్త విషయాలు బయటికి వచ్చాయి… ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారో.. ఓట్లను ఎలా తొలగిస్తున్నారో అని వివరించారు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో వివాదాస్పదంగా మారిన ఐటీ గ్రేడ్ డేటా కేసు..తెలుగు రాష్ట్రాలకు నిద్ర పట్టని ఇవ్వకుండా చేస్తున్న డేటా చోరీ అంశం..

ఈ కేసులో కీలక వివరాలు వెల్లడించిన హైదరాబాద్ సీపీ.

ఉదాహరణలతో సైతం వివరించి తెలిపారు సీపీ అంజనీ కుమార్.

ఏపీ ప్రజలకు సంబంధించిన ఆధార్, ఓటర్ ఐడీ లాంటి సున్నితమైన సమాచారం సేకరించి ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని తెలిపారు. టీడీపీకి చెందిన ‘సేవా మిత్ర’ యాప్‌ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే చేస్తున్నారని తెలిపారు. ఈ కుట్ర వెనుక ఎలాంటి వ్యక్తులు ఉన్నా తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ అంశంపై ఎన్నికల సంఘానికి లేఖ రాశామని, మరిన్ని గైడ్‌లైన్స్ కోరామని వివరించారు.డేటా చోరీ అంశంపై బుధవారం (మార్చి 6) మధ్యాహ్నం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

నియోజకవర్గాల వారీగా ప్రజల ఆధార్‌ నంబర్‌, సామాజిక వర్గం, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు తదితర వివరాలు సేకరిస్తున్నారని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. క్షేత్ర స్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్స్ పరిశీలిస్తోందని.. అనంతరం ఈ సమాచారాన్ని టీడీపీ బూత్‌ కన్వీనర్లకు చేరవేస్తున్నారని తెలిపారు. వారు పార్టీకి అనుకూలంగా లేని వ్యక్తులను గుర్తించి.. తమ ఓట్లను తొలగించాలంటూ ఆయా ఓటర్లే కోరుతున్నట్లుగా దరఖాస్తు చేస్తున్నట్లు అనుమానం వ్యక్తం చేశారు.

ఐటీ గ్రిడ్స్ సర్వేయర్ల నుంచి నేరుగా సమాచారం టీడీపీ బూత్‌ లెవల్‌ నేతలకు వెళ్తోందని సీపీ తెలిపారు. ఐటీ గ్రిడ్ సంస్థ తమ సర్వేయర్ల ద్వారా ఓటర్లకు ఫోన్‌ చేస్తున్నారని.. ఏ పార్టీకి ఓటు వేస్తారని తెలుసుకుంటున్నారని వివరించారు. ఓట్లు తొలగించారని ఫిర్యాదు చేసిన వ్యక్తి హైదరాబాద్‌లోనే ఉంటున్నారన్నారు.

సర్వేలో అడుగుతున్న ప్రశ్నలివే..

సర్వే చేయడానికి ఐటీ గ్రిడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ప్రశ్నావళి తయారు చేసిందని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఆ ప్రశ్నావళిలోని కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు..

  • మీరు మీ నియోజకవర్గంలో ఉన్నారా? లేకపోతే వేరే చోట ఉంటున్నారా?
  • మీరు ఏ పార్టీకి చెందిన వారు?
  • వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు?
  • వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటు వేస్తారు?
  • ఏ పార్టీకి ఎంత రేటింగ్ ఇస్తారు.

ఇలాంటి సున్నితమైన సమాచారాన్ని సేకరించి ఆ డేటాను భద్రపరిచి కీలక వ్యక్తికి అందజేస్తున్నట్లు సీపీ తెలిపారు. ఆ వ్యక్తి ఫీల్డ్ లెవల్ సేవామిత్రకు చేరవేయగా.. వాళ్లు సదరు వ్యక్తుల ఆధార్, ఓటర్ కార్డును సేకరిస్తున్నట్లు వెల్లడించారు. ఆ సమాచారమంతా ఐటీ గ్రిడ్ సంస్థ భద్రపరుస్తున్నట్లు చెప్పారు. ఎవరైతే నియోజకవర్గాల్లో లేరో వారి ఓట్లనే తీసేస్తున్నారని సీపీ తెలిపారు.

ఓట్ల తొలగింపునకు సీపీ చెప్పిన ఉదాహరణలు..

హైదరాబాద్‌లో ఉంటున్న పలువురి ఓటర్ ఐడీ కార్డులను ఆధారంగా చేసుకుని విచారణ జరిపినట్లు సీపీ తెలిపారు.

విచారణలో ఆయా వ్యక్తుల ఓటర్ ఐడీ కార్డులు డిలీట్ అయినట్టు తేలిందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఉదాహరణలు కూడా చెప్పారు.

విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందిన కందుల రంగారెడ్డి హైదరాబాద్‌లో ఉంటుండగా.. ఆయన ఓటు డిలీట్ అయిందని సీపీ తెలిపారు.

అదేవిధంగా చిత్తూరు జిల్లాకు చెందిన వేణుగోపాల్ రెడ్డి ఓటర్ ఐడీ కూడా డిలీట్ అయిందని సీపీ చెప్పారు. వాటిని వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చని చెప్పారు.

డేటా చోరీ అంశంలో హైదరాబాద్‌లోనూ కేసు నమోదు చేసినట్టు సీపీ అంజనీ కుమార్ చెప్పారు.

సైబరాబాద్ పోలీసులతో కలిసి హైదరాబాద్ కమిషనరేట్‌.. ఈ కేసును మరింత సమగ్రంగా విచారణ జరుపుతుందని సిపి స్పష్టం చేశారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *