‘జగన్ అనే నేను అసెంబ్లీలో…’ అనే శీర్షికతో వీడియో రూపొందించారు.టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్
అసెంబ్లీలో కునుకుతీసిన సీఎం జగన్.. నారా లోకేష్ సెటైర్లు
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కునుకుతీశారంటూ టీడీపీ ఎమ్మెల్సీ సెటైర్లు వేశారు.
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో సాధారణ బడ్జెట్ ప్రవేశపెట్టారు.
మంత్రి కురసాల కన్నబాబు వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కునుకుతీశారంటూ తెలుగు దేశం పార్టీ ఎమ్మెల్సీ నారా లోకేష్ సెటైర్లు వేశారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. సీఎం జగన్పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
గత అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇలాగే నిద్రపోయాడని, ఇప్పుడు కూడా అదే పనిచేస్తున్నాడనే అర్థం వచ్చేలా ‘జగన్ అనే నేను అసెంబ్లీలో…’ అనే శీర్షికతో వీడియో రూపొందించారు.
‘ఇంట్లో పబ్జీ.. అసెంబ్లీలో లాలిజో’ అంటూ నారా లోకేష్.. సీఎం జగన్పై సెటైర్లు వేశారు.
అలాగే ఈ సీఎం జగన్ నిద్రపోయారంటూ తెలుగు దేశం పార్టీ కార్యకర్తలు సైతం ట్రోల్ చేస్తున్నారు. సీఎం జగన్ను టార్గెట్గా చేసుకుని తీవ్ర విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
గతంలోనూ ఇలాగే చేశారంటూ పోస్టులు పెడుతున్నారు.