వాళ్లిద్దరూ నోరు విప్పితే లోకేష్, బాబు బండారం బయటకు…షాకిచ్చిన సొంత పార్టీ నేతలు.

చంద్రబాబు, లోకేష్కు షాకిచ్చిన టీడీపీ నేతలు
అనంతపురం జిల్లా తాడిపత్రి పర్యటనకు వెళ్లిన లోకేష్కు షాకిచ్చిన సొంత పార్టీ నేతలు.
లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్న ముఖ్య నేతలు. ఈ టూర్లో కనిపించింది ఒకరిద్దరు మాత్రమే.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్కు సొంత పార్టీ నేతలు షాకిచ్చారు.
అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ఫ్యామిలీని లోకేష్ పరామర్శించారు.. ఆయనకు కేడర్ ఘన స్వాగతం పలికారు.
అయితే లోకేష్ పర్యటనలో జిల్లాకు చెందిన ముఖ్య నేతలు కనిపించలేదు.
ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, మాజీ మంత్రి పరిటాల సునీత, ప్రభాకర్ చౌదరితో పాటూ మరికొందరు నేతలు లోకేష్ పర్యటనకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది.
మాజీ ఎమ్మెల్యేలు కందికుంట ప్రసాద్, ఉన్నం హనుమంతచౌదరి, జితేంద్ర గౌడ్ రాలేదు.
ఒకరిద్దరు ముఖ్య నేతలు తప్ప ఎవరూ పెద్దగా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.
టీడీపీ జిల్లా అధ్యక్షుడు పెనుగొండ మాజీ ఎమ్మెల్యే పార్థసారధి మాత్రం ఈ పర్యటనకు వెళ్లారు. మడకశిర నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రావణి కూడా ఉన్నారు.
ఒకరిద్దరు ముఖ్య నేతలు మాత్రమే కనిపించారు. టీడీపీలో ముఖ్యనేత, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పర్యటనకు ముఖ్య నేతలు దూరంగా ఉండటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ముఖ్య నేతలు కొందరు జిల్లాలో ఉన్నా అటువైపు వెళ్లలేదట.. కొందరు మాత్రం జిల్లాలో లేరని తెలుస్తోంది.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ అనంతపురం జిల్లా తాడిపత్రి చేరుకున్నారు.
లోకేష్ జేసీ కుటుంబసభ్యుల్ని పరామర్శించి.. వారికి సంఘీభావం తెలియజేశారు. అలాగే అరెస్ట్, తదితర అంశాలపై వారితో చర్చించారు.
జేసీ కుటుంబానికి పార్టీ ఉంటుందని లోకేష్ భరోసా ఇచ్చారు. జేసీ ప్రభాకర్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు లోకేష్.
దొంగ కేసులు పెడితే భయపడేది లేదని.. ఫిబ్రవరి నుంచి 22 కేసులు పెడుతూ వచ్చారన్నారు. అన్నీ రాసుకుంటున్నామని.. వడ్డీతో సహా చెల్లిస్తామన్నారు.