ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టిడిపి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి

అధికార టిడిపి కి దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. టిడిపి నుండి జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు పలు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ లో చేరుతున్నారు.

గుంటూరు జిల్లా గురజాల నియోజక వర్గానికి చెందిన టిడిపి నేతలు బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. డాక్టర్ ఉన్నం నాగ మల్లికార్జున రావు, వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం తదితర నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో కండువా కప్పుకున్నారు.

వీరందరినీ వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్సీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పార్టీ చేరిన నాయకులు చెప్పారు.

పిన్నేని రామకృష్ణారెడ్డి , మహేష్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్సీపీలో చేరారు,వీరితో పాటు 100 మంది కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీలో చేరారు.

విశాఖ జిల్లాల్లో అరకు సమన్వయకర్త చెట్టి పాల్గణ ఆధ్వర్యంలో వైయస్సార్ సిపి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సమక్షంలో, టిడిపి కాంగ్రెసు పార్టీకి చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు.

డిసిసి కార్యదర్శి కె అప్పారావు టిడిపి నాయకుడు పి అప్పారావు పొర్టు మాజీ సెక్రటరీ దామోదర్ తదితరులు వైఎస్ఆర్ సీపీలో చేరారు.

కర్నూలు జిల్లాలో పత్తికొండ వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ చమకుల పాడు శ్రీదేవి ,పార్టీ నేతలు బై రామయ్య, ప్రవీణ్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రామచంద్ర తో పాటు 200 మంది కార్యకర్తలు బుధవారం వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *