వైసీపీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరినట్టు ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ…

బాబు ఫోటో మార్ఫింగ్.. వర్మపై టీడీపీ నేత కేసు
చంద్రబాబు మెడలో వైసీపీ కండువాను జగన్ కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఓ మార్ఫింగ్ ఫోటో షేర్‌ చేసి ‘సీబీఎన్ ఇప్పుడే వైసీపీలో చేరారు’ అంటూ వివాదాల వర్మ ట్విట్టర్‌లో పోస్ట్ చేసి కామెంట్ పెట్టారు.

1.చంద్రబాబు నాయుడి ఫోటోను మార్ఫింగ్ చేసిన వివాదాల వర్మ.
2.వర్మ చేష్టలకు చర్యలు తీసుకోవాలని టీడీపీ అభిమాని ఫిర్యాదు.
3.రాంగోపాల్ వర్మపై కేసు నమోదుచేసిన బాచుపల్లి పోలీసులు.

వైసీపీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరినట్టు ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రెండు రోజుల కిందట ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.

చంద్రబాబు మెడలో వైసీపీ కండువాను జగన్ కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నట్లు ఓ మార్ఫింగ్ ఫోటో షేర్‌ చేసి ‘సీబీఎన్ ఇప్పుడే వైసీపీలో చేరారు’ అంటూ కామెంట్ పెట్టారు.

ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిపై టీడీపీ అభిమానులు తీవ్రంగా మండిపడుతున్నారు.

తమ మనోభావాలను కించపరిచేలా రామ్‌గోపాల్ వర్మ వ్యవహరించారంటూ ఓ టీడీపీ అభిమాని హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

బాచుపల్లికి చెందిన దేవిబాబు చౌదరి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

టీడీపీ అభిమానులను కించపరిచేదిగా చంద్రబాబు ఫోటోను మార్ఫింగ్ చేశారని ప్రస్తుతం అది సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోందని తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

అంతేకాదు, తాను ఏపీలో లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమాను విడుదల కాకుండా ఎలా అడ్డుకున్నానో ఈ వ్యవహారంపై కూడా అలాగే పోరాటం చేస్తానని దేవీబాబు అన్నారు.

ఈ విషయంలో రామ్‌గోపాల్‌వర్మ బహిరంగ క్షమాపణ చెప్పేంత వరకు వదిలే ప్రసక్తేలేదని ఉద్ఘాటించారు.

రామ్‌గోపాల్ వర్మ ఓ పనికిమాలినవాడు, మూర్ఖుడని, ఆయనకు మతిభ్రమించి ఏం చేస్తున్నాడో తనకే తెలియదని విమర్శించారు.

అంతేకాదు, ఆయన రాత్రికి తాగేసి పొద్దున్న దిగేటప్పటికి ఏం చేస్తాడో వర్మకే సోయ ఉండదని, తాను ఏ పార్టీకి సంబంధంలేని వ్యక్తినని చెప్పి, తాగేసిన తర్వాత వైసీపీకి చెందినవాడినే అని చెప్పుకుంటాడని బాబు చౌదరి మండిపడ్డాడు.

ఇంటర్నేషనల్ పిచ్చ సంఘానికి పాల్ అధ్యక్షుడైతే, అఖిల భారత పిచ్చ సంఘానికి వర్మ అధ్యక్షుడని దుమ్మెత్తిపోశారు.

బాబు చౌదరి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.

రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.

ఈ సినిమాను విడుదల చేయొద్దంటూ టీడీపీ సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయడంతోపాటు ఏపీ హైకోర్టులోనూ పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ సాగుతోంది.

ఏపీలో ఈ సినిమా ఇప్పటికీ విడుదల కాలేదు. హైకోర్టు స్టే విధించడంతో నిర్మాతలు సుప్రీంకోర్టును ఆశ్రయించగా వారికి అక్కడ చుక్కెదరయ్యింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *