గ్యాస్ లీక్ మృతుల ఒక్కో కుటుంబానికి రూ.50వేలు…టీడీపీ పార్టీ అండగా
సోమవారం బాధిత కుటుంబాలను కలిసి రూ.50వేల సాయంపై లేఖలు అందజేయనున్నారు. నేడు వారి అకౌంట్లలోకి రూ.50వేలు జమచేయనున్నారు.
గత నెలలో విశాఖలోని వెంకటాపురం సమీపంలో ఉన్న ఎల్జీ పాలిమర్స్ నుంచి స్టైరిన్ గ్యాస్ లీక్ కావడంతో 15మంది చనిపోగా.. వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు.
విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజ్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు టీడీపీ ముందుకు వచ్చింది.
ఆ కుటుంబాలకు ఆర్థికసాయం చేయాలని నిర్ణయించి.. ఆ సాయాన్ని ప్రకటించింది.
ఈ దుర్ఘటనలో 15మంది చనిపోగా.. మృతులకు సంబంధించి ఒక్కో కుటుంబానికి రూ.50వేల చొప్పున సోమవారం వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ నేతల్ని ఆదేశించారు.
సోమవారం స్థానిక ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో విశాఖ జిల్లా టీడీపీ జిల్లా నేతల మృతుల కుటుంబాలను కలవనున్నారు.
ఆ కుటుంబాలకు ఆర్థిక సాయంపై చంద్రబాబు రాసిన లేఖను అందజేయనున్నారు.
మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని..
అలాగే ఈ గ్యాస్ లీక్తో అనారోగ్యానికి గురైన బాధితులకు కూడా అన్నివిధాలా తోడుగా ఉంటామనే భరోసా నింపాలని విశాఖ పార్టీ నేతలకు చంద్రబాబు సూచించారు.
వందలాదిమంది అస్వస్థతకు గురయ్యారు. వీరంతా ఆస్పత్రుల్లో చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యారు.. కానీ వారిలో కొంతమందికి ఆరోగ్యపరమైన సమస్యలు వెంటాడుతున్నాయి.
అంతేకాదు విష వాయువు దెబ్బకు వందలాది పశువులు, పక్షులు ప్రాణాలు కోల్పోయాయి.. పెద్ద, పెద్ద చెట్లు సైతం పూర్తిగా మాడిపోయాయి.