టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కలిసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అధికారులు అనుమతి నిరాకరించారు…

చంద్రబాబుకు అనుమతి నిరాకరణ.. తేల్చిచెప్పిన అధికారులు

టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును కలిసేందుకు ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు అధికారులు అనుమతి నిరాకరించారు.

ఈఎస్‌ఐ కుంభకోణంలో అరెస్టయి అనారోగ్యం కారణంగా గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రి చికిత్స పొందుతున్న మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని పరామర్శించేందుకు గాను టీడీపీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు చేసుకున్న అభ్యర్థనలను అధికారులు తిరస్కరించారు.

గుంటూరులో అచ్చెన్నాయుడును పరామర్శించేందుకు చంద్రబాబుకు జైళ్ల శాఖ అధికారులు నిరాకరించారు. కోవిడ్ నిబంధనల ప్రకారం అనుమతి ఇవ్వలేమన్న తేల్చిచెప్పారు.

గత 2 నెలలుగా ఎవరికీ అనుమతి ఇవ్వడం లేదని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు. అలాగే చంద్రబాబు మరో వినతిపై జీజీహెచ్ ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు.

అచ్చెన్నాయుడును కలవాలంటే జిల్లా మేజిస్ట్రేట్ అనుమతి తీసుకోవాల్సిందేనని సూపరింటెండెంట్ స్పష్టం చేశారు.

కాగా, ఈఎస్‌ఐ కుంభకోణంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని ఆయన ఇంట్లో అరెస్ట్ చేసి.. సోదాలు కూడా నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐలో భారీగా అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చాయి.

ఏసీబీ కూడా రంగంలోకి దిగి కేసును దర్యాప్తు చేస్తోంది. ఇదే సమయంలో అచ్చెన్నాయుడ్ని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *