జగన్ సర్కార్‌.. ఏపీ ప్రజల్ని వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు చంద్రబాబు

గతంలో అమరావతిని రాజధానిగా అంగీకరించారని.. ఇప్పుడు ఏపీ ప్రజల్ని మీరు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు.

ప్రజల్లో చైతన్యం రావాలని.. ఎలా మాట తప్పారో.. మడప తిప్పారో ప్రజలు తెలుసుకోవాలన్నారు.

టడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు జగన్ సర్కార్‌కు మరోసారి సవాల్ విసిరారు.

రాజీనామా సవాల్ విసిరితే పారిపోయారని..ధైర్యం ఉంటే అసెంబ్లీని రద్దు చేయాలని.. ఒకవేళ వైఎస్సార్‌సీపీ గెలిస్తే తాను రాజధాని గురించి మళ్లీ మాట్లాడను అన్నారు.

ధైర్యం ఉంటే ఎన్నికలకు రావాలన్నారు.ప్రజల కోసమే తమ పోరాటమని.. తన కోసమో, పార్టీ కోసమో కాదన్నారు.

గతంలో అమరావతిని రాజధానిగా అంగీకరించారని.. ఇప్పుడు ఏపీ ప్రజల్ని మీరు వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు.

ప్రజల్లో చైతన్యం రావాలని.. ఎలా మాట తప్పారో.. మడప తిప్పారో ప్రజలు తెలుసుకోవాలన్నారు.

ఎన్నికలకు ముందు జగన్ ఏం చెప్పారు.. ఇప్పుడు ఏం చేస్తున్నారని చంద్రబాబు ప్రశ్నించారు.

అమరావతిని ఆపేస్తారని ముందే చెప్పానని.. ఇప్పుడు అదే జరుగుతుందని.. ప్రజల్ని అడగకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారన్నారు.

రైతుల విశ్వాసాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రంపై ఉందని.. కేంద్రం జోక్యం చేసుకుని రాజధానిని కాపాడాలన్నారు.

రాష్ట్ర విభజన కంటే పెద్ద అన్యాయం జరుగుతోందని.. ఇలాంటి నాయకులకు బుద్ధి చెప్పే పరిస్థితి రావాలి అన్నారు. ప్రజా ప్రయోజనాలను వదిలి నీచ రాజకీయాలను చేస్తున్నారని.. అన్నీ మరిచిపోయి మూడు ముక్కలాట ఆడుతున్నారని విమర్శించారు.

అమరావతిపై ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చంద్రబాబు కోరారు. రాజధానిని మార్చే అధికారం ఏపీ ప్రభుత్వానికి లేదని.. ప్రజల భాగస్వామ్యంతో పోరాటం ఉద్ధృతం చేస్తామన్నారు.

ఐదు కోట్ల మంది ప్రజలు తమతో కలిసి రావాలని పిలుపనిచ్చారు. నీతికి, నిజాయతీకి మారు పేరు.. విశాఖ వాసులని.. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని.. తమ పదవులు వదిలేస్తామన్నారు. 2014లో అన్యాయం జరిగిందని.. మళ్లీ మళ్లీ మోసపోవడం తగదన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *