ప్రతిపక్ష నేతకు చినజీయర్ స్వామి దివ్య ఆశీస్సులు…

చినజీయర్ స్వామిని కలిసిన వైఎస్ జగన్.. ఆశ్రమంలో ఆశీస్సులు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చినజీయర్ స్వామిని కలుసుకున్నారు. శంషాబాద్‌లోని ఆశ్రమంలో చినజీయర్ స్వామిని కలిసిన జగన్ కాసేపు ప్రత్యేకంగా మాట్లాడారు.

1.చినజీయన్ స్వామిని కలిసిన వైఎస్ జగన్.
2.శంషాబాద్ ఆశ్రమంలో స్వామిజీతో ప్రత్యేక భేటీ.
3.ఎన్నికల ముందు జగన్.. జీయర్ స్వామిని కలవడంపై సర్వత్రా ఆసక్తి.
4.ప్రతిపక్ష నేతకు చినజీయర్ స్వామి దివ్య ఆశీస్సులు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేద గురువు చినజీయర్‌ స్వామిని కలిశారు.

శనివారం (మార్చి 2) సాయంత్రం ఢిల్లీ నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న జగన్..

అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో ఉన్న చినజీయర్‌ స్వామి దివ్యసాకేత ఆశ్రమానికి చేరుకున్నారు.

ఆశ్రమంలో కాసేపు గడిపిన జగన్.. చినజీయర్‌ స్వామితో ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ఆయన దివ్య ఆశీస్సులు తీసుకొని లోటస్ పాండ్‌కు బయలుదేరారు

వైఎస్ జగన్ శనివారం ఉదయం ఢిల్లీలో ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే.

జాతీయ రాజకీయాలు, ఏపీ ఎన్నికలకు సంబంధించి ఆయన తన ఆలోచనలను పంచుకున్నారు. త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో వైఎస్ జగన్..

చినజీయర్ స్వామిని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఆయన గతంలోనూ ఒకసారి చినజీయర్‌ స్వామిని కలిశారు. వైఎస్‌ జగన్‌ వెంట పార్టీ నాయకులు విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *