హైకోర్టు న్యాయవాది జంధ్యాల రవి శంకర్ ఆసక్తికర ట్వీట్ ..నిమ్మగడ్డ రమేష్ కుమార్

నిమ్మగడ్డ కేసు: ఏపీ సర్కార్కు సోమవారం డెడ్లైన్?.. సీనియర్ లాయర్ ఆసక్తికర ట్వీట్
రమేష్ కుమార్ తొలగింపుపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. కానీ ఆయన్ను ఎస్ఈసీగా నియమించేందుకు ప్రభుత్వం నో అంటోంది. ఇదే అంశాన్ని ప్రశ్నిస్తూ సీనియర్ లాయర్ జంధ్యాల ట్వీట్ చేశారు.
ఏపీలో ఎస్ఈసీ వ్యవహారం దుమారం రేపుతూనే ఉంది.
నిమ్మగడ్డ కేసుపై ఓవైపు సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతుండగానే.. ప్రముఖ హైకోర్టు న్యాయవాది జంధ్యాల రవి శంకర్ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
రమేష్ కుమార్ తొలగింపుపై ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ను కొట్టివేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.. కానీ ఆయన్ను ఎస్ఈసీగా నియమించేందుకు ప్రభుత్వం నో అంటోంది.
ఇదే అంశాన్ని ప్రశ్నిస్తూ సీనియర్ లాయర్ జంధ్యాల ట్వీట్ చేశారు.. కొన్ని ప్రశ్నలు సంధించారు.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏపీ ప్రభుత్వం, సీఎస్ మీద సోమవారం కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తారా..
హైకోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం సోమవారంలోగా అమలు చేస్తుందా అంటూ జంధ్యాల రవిశంకర్ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.
ఆయన చేసిన ట్వీట్ గమనిస్తే రమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించబోతున్నారని సంకేతాలు ఇచ్చినట్లు కనిపిస్తోంది.
తనను పదవిలో కొనసాగించాలన్న కోర్టు ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయలేదంటూ పిటిషన్ వేసేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ సిద్ధమయ్యారని.. అలాగే కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తారనే చర్చ జరుగుతోంది.