తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల…

తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల
రెండు రాష్ట్రాల్లో సోమవారం (25-02-2019) ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది. నామినేషన్ల దాఖలుకు మార్చి 5 తుదిగడువు కాగామార్చి 22న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌. మార్చి 26న ఫలితాలు.

ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో ఎన్నికలు
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు
అమల్లోకి వచ్చిన ఎన్నికల నియమావళి

సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఆదివారం ఉపాధ్యాయ, పట్టభద్రుల కోటాలో జరగనున్న ఎన్నికలకు షెడ్యూల్ విడుదలయ్యింది.

రెండు రాష్ట్రాల్లో సోమవారం (25-02-2019) ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడనుంది.

నామినేషన్ల దాఖలుకు మార్చి 5 తుదిగడువు కాగా.. మార్చి 6న నామినేషన్ల పరిశీలన, మార్చి 8న ఉపసంహరణకు గడువు.

మార్చి 22న ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు పోలింగ్‌ నిర్వహిస్తారు.

మార్చి 26న ఫలితాలు వెల్లడిస్తారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది.

ఏపీలోని తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు.. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి.

తెలంగాణలోని మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌, కరీంనగర్ జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు.. వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *