తిరుమలకు మెట్ల మార్గంలో చేరుకోవడంతో రాహుల్గాంధీ రికార్డు నెలకొల్పారు.
ఆ విషయంలో జగన్ కంటే చంద్రబాబే స్పీడ్…
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 2017 మే 4న సీఎం హోదాలో తిరుమలకు వచ్చారు.
మోకాలి పర్వతం సమీపంలో జోరువానలోనూ నడుస్తూ సుమారు 2గంటల 35 నిమిషాల సమయంలోనూ తిరుమలకు చేరుకున్నారు.
1.తిరుమలకు మెట్ల మార్గంలో చేరుకోవడంతో రాహుల్గాంధీ రికార్డు నెలకొల్పారు.
2.ప్రముఖుల్లో అత్యంత వేగంగా మెట్లు ఎక్కింది రాహులేనని తితిదే వర్గాలు అంటున్నారు.
3.ఈ మెట్లు ఎక్కడానికి చిరంజీవికి 6.40 గంటల సమయం పట్టింది
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్గాంధీ గురువారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన సంగతి తెలిసిందే. రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆయన అలిపిరి చేరుకుని అక్కడి నుంచి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్నారు.
అలిపిరి నుంచి తిరుమలకు దూరం 9కిలోమీటర్లు. 3,550 మెట్లు. ఈ మార్గంలో కాలినడకన తిరుమల చేరుకోవాలంటే సాధారణ భక్తులకు 3-4 గంటలు పడుతుంది.
కానీ రాహుల్ గాంధీ కేవలం గంటా 48 నిమిషాల్లోనే చేరుకున్నారు. 48ఏళ్ల వయసున్న రాహుల్ ఇంత స్పీడ్గా చేరుకోవడంపై అందరూ ఆశ్చర్యపోతున్నారు.
ఆయన ఫిట్నెస్ ఎలాంటిదో దీని ద్వారా తెలుసుకోవచ్చని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. గతంలో ప్రముఖులెవరూ ఇంత వేగంగా తిరుమల చేరుకోలేదని తితిదే వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశం ఇప్పుడు శ్రీవారి భక్తుల్లో చర్చనీయాంశమైంది.
దీంతో మన తెలుగు ప్రముఖులు ఎంత సమయంలో తిరుమల చేరుకున్నారన్న సమాచారం
మోకాలి పర్వతం సమీపంలో జోరువానలోనూ నడుస్తూ సుమారు 2గంటల 35 నిమిషాల సమయంలోనూ తిరుమలకు చేరుకున్నారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రజా సంకల్పయాత్ర ముగించుకుని జనవరి 10న తిరుమలకు నడక మార్గాన వచ్చారు.
అలిపిరి నుంచి తిరుమలకు 3 గంటల 10 నిమిషాలు సమయం తీసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ స్థాపించిన సమయంలో చిరంజీవి తిరుమలకు కాలినడక మార్గంలో వెళ్లారు.
సుమారు 6 గంటల 40 నిమిషాల పాటు నడిచారు. ప్రముఖుల్లో ఆయనే ఎక్కువ సమయం తీసుకున్నారు.
ఇక జనసేన అధినేత పవన్కళ్యాణ్ గతంలో కొండగట్టు ఆంజనేయస్వామి ఆశీస్సులు తీసుకున్న తిరుపతి చేరుకున్నారు.
రాత్రి సమయంలో అలిపిరి నుంచి తిరుమలకు 3 గంటల 20 నిమిషాల్లో చేరుకున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నర్గా పని చేసిన దువ్వూరు సుబ్బారావు తిరుమలకు కాలినడకన 2.30 గంటల్లోనే చేరుకోవడం విశేషం.