రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించగా ఖైదీ నెంబర్ 1573గా అచ్చెన్నాయుడు

టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు.

రిమాండ్ ఖైదీగా జైలుకు తరలించగా, నంబర్ 1573ని జైలు అధికారులు కేటాయించారు. ప్రస్తుతం ఆయనకు గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

టీడీపీ ప్రభుత్వం హయాంలో అచ్చెన్నాయుడు కార్మికశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ మందుల కొనుగోళ్ల వ్యవహారంలో అవినీతి జరిగిందంటూ ఏసీబీ అధికారులు ఆయనను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఈఎస్ఐ స్కామ్ లో భాగంగా పోలీసులు అరెస్ట్ చేసిన అచ్చెన్నాయుడిని అనారోగ్య కారణాల దృష్ట్యా పోలీసులు, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే.

శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన అచ్చెన్నాయుడిని ఆయన స్వగ్రామం నిమ్మాడలో ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఏ-1గా రమేశ్ కుమార్ ను చేర్చిన పోలీసులు ఏ-2గా అచ్చెన్నాయుడిని, ఏ-3గా ప్రమోద్ రెడ్డి పేర్లను చేర్చారు.

అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్న సమయంలో అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఏసీబీ పేర్కొంది. ప్రస్తుతం ఆయనకు గుంటూరు గవర్నమెంట్ ఆస్పత్రిలోని పొదిలి ప్రసాద్ బ్లాక్ లో ఉన్న తొలి అంతస్తులోని ప్రత్యేక గదిలో వైద్య చికిత్సను అందిస్తున్నారు.

ఇటీవల ఆయనకు మొలల ఆపరేషన్ జరుగగా, ఆ ప్రాంతంలో ఇన్ఫెక్షన్ ఏర్పడినట్టు తెలుస్తోంది. రక్తస్రావం అవుతూ ఉండటంతో, వైద్యులు యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారు. రక్తస్రావం తగ్గకుంటే మళ్లీ ఆపరేషన్ చేస్తామని వైద్యులు అంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *