2009లో ప్రజారాజ్యం, 2014లో వైఎస్సార్‌సీపీ,2019లో టీడీపీ..మూడుసార్లు పోటీచేసి ఓటమి పాలయ్యారు ,కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ..మరి ఈ రోజు వైఎస్సార్‌సీపీ చేరబోతున్నారు..సుమన్

జగన్ సమక్షంలో వైసీపీలోకి కీలక నేత.. బాబు, పవన్‌లకు చెక్

మూడుసార్లు పోటీచేసి ఓడిపోయారు. 2009లో ప్రజారాజ్యం తరపున.. 2014లో వైఎస్సార్‌సీపీ.. 2019లో టీడీపీ నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటున్నారు.

టీడీపీకి మరో షాక్ తగిలింది.. అనుకున్నదే జరిగింది. ఆ పార్టీ నేత చెలమలశెట్టి సుమన్ పార్టీకి గుడ్ బై చెప్పనున్నారు. ఈ రోజు ఆయన వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. ఆయన వెంట పలువురు అనుచరులు కూడా మళ్లీ తిరిగి సొంతగూటికి చేరనున్నారు. చాలా రోజులుగా సునీల్ చేరికపై ప్రచారం జరుగుతున్నా ఆలస్యమవుతుందని అందరూ భావించారు.. కానీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారట.

సునీల్ మూడుసార్లు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే రాజకీయంగా చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నారు. అయితే కొద్దిరోజులుగా ఆయన వైఎస్సార్‌సీపీలో చేరబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ప్రాంతంలో చెలమలశెట్టి సునీల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. మూడుసార్లు, మూడు పార్టీలు మారినా ఆయన ఎంపీ ముచ్చట మాత్రం తీరలేదు.. మూడుసార్లు ఆయనకు ఓటమి ఎదురైంది. ఆర్థికంగా, స్థానికంగా బలమైన నేతగా ఉన్నా నిరాశే ఎదురవుతోంది.

సునీల్ రాకకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వెనుక వైఎస్సార్‌సీపీ రాజకీయ వ్యూహం ఉందనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేనలు కలిసి పోటీచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సునీల్ టీడీపీకి గుడ్ బై జనసేనలో చేరి మళ్లీ పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. పోనీ టీడీపీలో కొనసాగి మళ్లీ పోటీచేసే ఛాన్స్ ఉంది.

సునీల్‌ను వైఎస్సార్‌సీపీలోకి తీసుకొస్తే అక్కడ ప్రత్యర్థులకు చెక్ పెట్టొచ్చనే భావనలో అధిష్టానం ఉందట. అంతేకాదు సునీల్ కాపు సామాజిక వర్గం కావడంతో స్థానికంగా కూడా పార్టీకి ప్లస్ అవుతుందని భావిస్తున్నారట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *