పోలవరం సందర్శన యాత్ర పేరుతో 400 కోట్లు దోపిడి

ప్రభుత్వ జీవోలే సాక్ష్యాలు

పట్టపగలు జరుగుతున్న దోపిడీని చూస్తుంటే నక్సలైట్లలో చేరి ఈ దోపిడీదారుల అంతు చూడాలనిపిస్తుంది .

ఇలాంటి దోపిడీ ప్రపంచంలోనే ఎక్కడా ఉండి ఉండదు , అసలు కనీసం మనం వినికూడా ఉండం . పది శాతం కూడా పూర్తికాని పోలవరం ప్రాజెక్ట్ ని చూడటం కోసం ప్రజలని ప్రభుత్వ ఖర్చుతో తరలించటం ఏమిటీ ..దానికోసం ఇప్పటిదాకా 400 కోట్లు ఖర్చు చేయటం ఏమిటి ? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా ? పత్రికలు , ప్రభుత్వ వ్యవస్థలు పని చేస్తున్నాయా ?

కడుపుకి అన్నం తినే వాళ్ళు ఎవరైనా ఇలాంటి దోపిడీని సమర్థిస్తారా ? పైపెచ్చు ఇప్పటిదాకా రెండు లక్షల మంది సందర్శించారని పచ్చ మాఫియా గొప్పలు చెప్పుకొంటోంది .

పోలవరం సందర్శన మరియు ఇతర ప్రయాణ ఖర్చులకి ఇప్పటిదాకా 19 జీవోలు జారీ చేసారు . పూర్తి వివరాలు చూడండి .

1) . జీవో నెం – 1709 ,తేదీ – 05-09-2018 ( ఫోటో 1 )
–> విడుదల చేసిన మొత్తం – 23,16,00,000 ( 23 కోట్ల 16 లక్షలు )
— >జీవోలో చెప్పిన కారణం — పోలవరం సందర్శన యాత్ర కోసం బస్సులు , బ్రేక్ఫాస్ట్ , లంచ్ , స్నాక్క్స్ , డిన్నర్ .

2) జీవో నెం — 311 , తేదీ – 27.04.2018 ( ఫోటో 20 ,21 )
— >విడుదల చేసిన మొత్తం – 22,25.00.000 ( 22 కోట్ల 25 లక్షలు )

— >జీవోలో చెప్పిన కారణం — పోలవరం సందర్శన యాత్ర కోసం బస్సులు , బ్రేక్ఫాస్ట్ , లంచ్ , స్నాక్క్స్ , డిన్నర్ .

3 ) జీవో నెం – 211 , తేదీ – 15.02.2018 ( ఫోటో 2 )
–> విడుదల చేసిన మొత్తం – 23,35,00,000 ( 23 కోట్ల ముప్పైఐదు లక్షలు )
–> జీవోలో చెప్పిన కారణం — అడ్వర్టైజ్మెంట్ , పబ్లిసిటీ ఖర్చులు

4 ) జీవో నెం – 1226 , తేదీ -26.05.2018 ( ఫోటోలు 3,4 )
–> విడుదల చేసిన మొత్తం — 89,60,72,000 ( 89 కోట్ల 60 లక్షల 72 వేలు )
— > జీవోలో చెప్పిన కారణం — వాహనాలు , ఆఫీస్ ఖర్చులు , ప్రయాణ ఖర్చులు .

జీవోలు మీరు క్షుణ్ణంగా పరిశీలించండి —
—->ఒక్కో బస్సు కి — 55 వేలు
—-> కిలోమీటర్ కి — 66 రూపాయలు
—-> టిఫిన్ –75 రూపాయలు
—-> లంచ్ —125 రూపాయలు
—-> సాయంత్రం టీ , స్నాక్స్ — 50 రూపాయలు
—–> డిన్నర్ —125 రూపాయలు

ఇదీ ఒక్కో మనిషికి ప్రభుత్వం పెడుతున్న ఖర్చు . ఇప్పటివరకు రెండు లక్షల మంది సందర్శించినట్లు లెక్కలో రాసుకొన్నారు .

కేవలం 2018 లోనే పోలవరం బస్సు యాత్ర పేరుతో దోచుకొన్నది అక్షరాలా 158 కోట్లు . ఇది కాకుండా మిగిలిన ఈ మూడు నెలల కాలానికి మరో 71 కోట్లు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది . అంటే 2018 మొదలుకొని ఇప్పటిదాకా పోలవరం బస్సు యాత్ర పేరుతొ దోచుకొన్నది అక్షరాలా 229 కోట్లు .

పైనాలుగు జీవోలు గడచిన సంవత్సరం కాలంలో కేవలం రైతులు పోలవరం యాత్ర సందర్శన పేరుతో విడుదల చేసారు .

మిగిలిన ఈ క్రింది జీవోలు 2017 ,2016 లలో పోలవరం ఆఫీస్ ఖర్చులు , ప్రయాణ ఖర్చులు పేరుతొ మిగిలిన 15 జీవోలు జారీ చేసారు .

5 ) జీవో నెం – 76 , తేదీ – 22.1.2018 ( ఫోటో 5 )
–> విడుదల చేసిన మొత్తం — 8,74,72,000 ( 8 కోట్ల 74 లక్షల 72 వేలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు .

6 ) జీవో నెం – 2107 , తేదీ – 2.11.2017 ( ఫోటో 6 )
–> విడుదల చేసిన మొత్తం — 10,24,72,000 ( 10 కోట్ల 24 లక్షల 72 వేలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు .

7 ) జీవో నెం – 1558 , తేదీ – 09.07.2017 ( ఫోటో 7 )
–> విడుదల చేసిన మొత్తం – 10,24,72,000 ( 10 కోట్ల 24 లక్షల 72 వేలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు ,

8 ) జీవో నెం – 1393 , తేదీ – 11.06.2017 ( ఫోటో 8 )

–> విడుదల చేసిన మొత్తం – 4,06,25,000 ( 4 కోట్ల 6 లక్షల 25 వేలు )

–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు ,
9 ) జీవో నెం – 1307 , తేదీ – 26.05.2017 ( ఫోటో 9 )
–> విడుదల చేసిన మొత్తం – 1,01,25,000 ( 1 కోటి 1 లక్ష 25 వేలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు .

10 ) జీవో నెం – 1306 , తేదీ – 26.05.2017 ( ఫోటో 10 )
–> విడుదల చేసిన మొత్తం – 12,00,00,000 ( 12 కోట్లు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు ,

11 ) జీవో నెం – 1070 , తేదీ – 24.04.2017 ( ఫోటో 11 )
–> విడుదల చేసిన మొత్తం – 13,51,87,000 ( 13 కోట్ల 51 లక్షల 87 వేలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు ,

12 ) జీవో నెం – 555 , తేదీ – 21.03.2017 ( ఫోటో 12 )

–> విడుదల చేసిన మొత్తం – 37,80,00,000 ( 37 కోట్ల 80 లక్షలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు ,

13 ) జీవో నెం – 2361 , తేదీ – 23.12.2016 ( ఫోటో 13 )
–> విడుదల చేసిన మొత్తం – 13,75,00,000 ( 13 కోట్ల 75 లక్షలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు

14 ) జీవో నెం – 2070 , తేదీ – 19.10.2016 ( ఫోటో 14 )
–> విడుదల చేసిన మొత్తం – 13,75,00,000 ( 13 కోట్ల 75 లక్షలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు ,

15 ) జీవో నెం – 1840 , తేదీ – 12.08.2016 ( ఫోటో 15 )
–> విడుదల చేసిన మొత్తం – 13,75,00,000 ( 13 కోట్ల 75 లక్షలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు ,

16 ) జీవో నెం – 1689 , తేదీ – 06.07.2016 ( ఫోటో 16 )
–> విడుదల చేసిన మొత్తం — 42,50,000 ( 42 లక్షల 50 వేలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు ,

17 ) జీవో నెం – 1402 , తేదీ – 09.05.2016 ( ఫోటో 17 )
–> విడుదల చేసిన మొత్తం – 13,32,50,000 ( 13 కోట్ల 32 లక్షల 50 వేలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు ,

18 ) జీవో నెం – 1371 , తేదీ – 07.05.2016 ( ఫోటో 18 )
–> విడుదల చేసిన మొత్తం –5,34,90,000 ( 5 కోట్ల 34 లక్షల 90 వేలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు ,

19 ) జీవో నెం – 398 , తేది – 05.03.2016 ( ఫోటో 19 )
–> విడుదల చేసిన మొత్తం – 15,34,17,000 ( 15 కోట్ల 34 లక్షల 17 వేలు )
–> జీవోలో చెప్పిన కారణం — ఆఫీస్ ఖర్చులు , భోజనాలు ఖర్చులు , ప్రయాణ ఖర్చులు .

2018 నుండి పోలవరం బస్సు యాత్ర పేరుతొ విడుదల చేసిన మెదటి నాలుగు జీవోలు మరియు 2017 , 2016 లలో పోలవరంలో ఆఫీస్ ఖర్చులు , ప్రయాణ ఖర్చులు , పబ్లిసిటీ ఖర్చులు పేరుతొ విడుదల చేసిన 15 జీవోలు కలుపుకొంటే .. ఇప్పటివరకూ దోచుకొన్నది అక్షరాలా 331 కోట్ల 69 లక్షల 32 వేలు .

ఇది సరిపోదన్నట్లు ‘ ఎన్నికలు జరిగే వరకూ పోలవరం బస్సు యాత్రల పేరుతో ప్రజలని తరలించాలని అందుకోసం ఇంకో 71 కోట్లు విడుదల చేయాలనీ నిర్ణయించారు . విడుదల చేయబోయే ఈ 71 కోట్లు కలుపుకొంటే పోలవరం బస్సు యాత్రల ఖర్చు 400 కోట్లు పైమాటే .

పోలవరంలో ఇప్పటిదాకా పెట్టింది ఒకే ఒక్క గేట్ , ఈ 400 కోట్లు పెడితే సగం గేట్లు పూర్తయ్యేవి . పులిచింతల పెండింగ్ పనులు పూర్తయ్యేవి . 400 కోట్లతో రాష్ట్రంలో ఎన్నో సమస్యలని పరిష్కరించొచ్చు .

పోలవరం బస్సు యాత్రలో తాగి చిందులేసే వార్తలు చూస్తూనే ఉన్నాము . ఇష్టమొచ్చిన లెక్కలు రాసుకోవటం దోచుకోవటం . దీనిలో 100 కోట్లకి భారీ నీటిపారుదలశాఖా మంత్రి దేవినేని ఉమా నియోజకవర్గం నుండి లక్ష మంది సందర్చించారని లెక్కల్లో చూపెట్టారు .

పోలవరంలో ఈరకంగా దోపిడీ చేసుకోవచ్చనే ఉద్దేశ్యంతోనే కేంద్రం కట్టాల్సిన ప్రాజెక్ట్ ని తన చేతుల్లోకి తీసుకోని ప్రత్యేకహోదాని తాకట్టుపెట్టాడు చంద్రబాబు .

ప్రజలారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి . కనీవినీ ఎరగని దోపిడీని ప్రశ్నించండి . రాబోయే ఎన్నికలలో ఈ దోపిడీదారుల పాలనని అంతం చేద్దాం కదలిరండి .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *