ఆన్ లైన్ రమ్మీ, పోకర్ నిర్వహించే వారికి ఏడాది పాటు జైలు శిక్ష…సీఎం జగన్ నిర్ణయం

సీఎం జగన్ నిర్ణయం భేష్.. ఏపీ బీజేపీ నేత పొగడ్తలు, ఇదేం ట్విస్ట్!
రాష్ట్ర వ్యాప్తంగా చాలా కుటుంబాలు, పిల్లలు ఈ వ్యసనానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నారని.. అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వం చట్టం చేయడం మంచి నిర్ణయమన్నారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ నేత స్వాగతించారు.
పేకాట, ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూదం నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు రాష్ట్ర ఉపాధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి.
ఆన్లైన్ రమ్మీ, పోకర్ వంటి జూద క్రీడల నిషేధంతో యువతకు మంచి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, కేబినెట్కు అభినందనలు తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా చాలా కుటుంబాలు, పిల్లలు ఈ వ్యసనానికి బానిసై ఆత్మహత్య చేసుకున్నారని.. అసాంఘిక కార్యక్రమాలపై ప్రభుత్వం చట్టం చేయడం మంచి నిర్ణయమన్నారు.
రాష్ట్రంలో పేకాట, ఆన్ లైన్లో పేకాట రమ్మీ, పోకర్ లాంటి జూదాలను నిషేధించారు. కేబినెట్లో ఆన్ లైన్ జూదాలపై చర్చించారు.
ఆన్ లైన్ జూదం, పేకాటలను నిషేధిస్తూ గేమింగ్ చట్టంలో సవరణల్ని ఆమోదించారు.
ఆన్ లైన్లో ఎవరైతే రమ్మీ, పోకర్ లాంటి జూదాన్ని నిర్వహించే వారికి జరిమానా, శిక్ష విధిస్తారు. దీనికి సంబంధించి జీవో జారీ చేయాలని కేబినెట్ తీర్మానం చేసింది.
ఆన్ లైన్ రమ్మీ, పోకర్ నిర్వహించే వారు మొదటిసారి పట్టుబడితే వారికి ఏడాది పాటు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.
ఒకవేళ రెండో సారి కూడా పట్టుబడితే వారికి రెండేళ్ల జైలు, జరిమానా విధిస్తారు.
అలాగే, ఆన్ లైన్లో జూదం ఆడేవారికి కూడా ఆరు నెలల శిక్ష పడుతుంది.
కొందరు డబ్బు కోసం ఆన్ లైన్ పేకాట నిర్వహిస్తూ యువతను తప్పుదారి పట్టిస్తున్నారని..
ఇటీవల చాలామంది ఇలాగే డబ్బు పోగొట్టుకుంటున్నారని కేబినెట్ భేటీలో చర్చ జరిగింది. దీంతో జూదాలపై నిషేధం విధించారు.